Skip to main content

పేర్ని కుటుంబంపై విమర్శలు చేస్తే సహించం - మాజీ కార్పొరేటర్ మేకల సుబ్బన్న

మచిలీపట్నం : 

మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య (నాని) బందరు నియోజకవర్గ వైయస్సార్సీపి ఇంచార్జ్ పేర్ని కిట్టులపై, పేర్ని కుటుంబం పై ఇష్టారాజ్యంగా మాట్లాడితే వైసిపి కార్యకర్తలు ఎవ్వరు సహించరని మాజీ కార్పొరేటర్ మేకల సుబ్బన్న ఘాటుగా స్పందించారు. 

మేకల సుబ్బన్న మాట్లాడుతూ పేర్ని కృష్ణమూర్తి కుటుంబం పై అవాకులు, చవాకులు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. మంగళవారం స్థానిక రామానాయుడుపేట వైయస్సార్సీపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంతో ఘన చరిత్ర కలిగిన పేర్ని కుటుంబాన్ని విమర్శించే స్థాయి జనసేన నాయకులకు లేదన్నారు. తమతో బాటే ఉండి జనసేనలో చేరిన కొరియర్ శ్రీను ఇప్పుడు ఇష్టారాజ్యంగా పేర్ని నాని,కిట్టులను విమర్శించడం సహేతుకం కాదన్నారు. ఏ పార్టీ వారైనా, పరామర్శించడం పేర్ని కుటుంబ నైజం అన్నారు. కొబ్బరి తోటలో ఇల్లు కూల్చిన వారి ఇంటికి వెళ్లి పేర్ని నాని, కిట్టులు కుటుంబ సభ్యులను పరామర్శించడం తప్పా?అని ప్రశ్నించారు. 

సుబ్బన్న మాట్లాడుతూ పేర్ని కృష్ణమూర్తి కుటుంబానికి ఎంతో ఘన చరిత్ర ఉందని, అలాంటి కుటుంబం పై అపవాదులు వేస్తే సహించం అన్నారు. తాను 20 సంవత్సరాలుగా నిజాయితీగా వ్యాపారం చేస్తున్నానన్నారు. నగరంలో తాగడానికి నీరు దొరకదు కానీ, 34 పంచాయితీల్లో యదేచ్ఛగా 24 గంటలు మద్యం ఏరులై పారుతోందని దీనికి స్థానిక మంత్రి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మంత్రి ఇలాకాలో మంచినీళ్లు దొరకవు కానీ,మద్యం, బెల్టు షాపులు విస్తారంగా దొరుకుతాయన్నారు. ఇది అబద్ధమైతే తాను కోనేరు సెంటర్లో ముక్కు నేలకు రాసి, తన ఆస్తులను ఎవరికి వ్రాయమంటే వాళ్ళకి రాసి బందరు వదిలి వెళ్ళిపోతానన్నారు. జనసేన పార్టీ జెండా కట్టే దమ్ముంటే వచ్చి పేర్ని నాని ఇంటి ముందు కట్టండి. అప్పుడు తాము ఏంటో చూపిస్తాం, అని సవాలు విసిరారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, వైస్సార్సీపీ నాయకులు  పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...