Skip to main content

Posts

బందరు పోర్టును మేమే పూర్తి చేస్తాం: మంత్రి కొల్లు రవీంద్ర

Recent posts

ఇంధన కొరత, పోర్టు పనులపై వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం

మచిలీపట్నం : కృష్ణాజిల్లాలో ఇంధన కొరత, మచిలీపట్నం పోర్టు నిర్మాణం వంటి కీలక అంశాలపై వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వై వి సుబ్బారెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మచిలీపట్నంలో సత్యా కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సంకల్ప సాధన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో డీజిల్–పెట్రోల్ కొరతపై ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఇంధన కొరత తీవ్రంగా ఉందని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీజిల్ కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా ఆక్వా రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద వైసీపీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వం స్పందించేలా ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యమని చెప్పారు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంపై మాట్లాడుతూ, రాష్ట్రంలో నాలుగు పోర్టుల పనులు సుమారు 40 శాతం పూర్తయ్యాయని, ఆరు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం కూడా చివరి దశలో ఉందన్నారు. అయితే ప్రస్తుత ...

జిల్లా అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి – జిల్లా కలెక్టర్

మచిలీపట్నం:  జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలు తక్షణం సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ జిల్లాలోని వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనల తయారీపై నియోజకవర్గాల ప్రత్యేక అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో సమగ్ర అభివృద్ధి కోసం ప్రాధాన్యత క్రమంలో ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, గుడివాడ, పామర్రు, గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలకు సంబంధించిన సీసీ, బీటీ రహదారుల అభివృద్ధి, సీసీ డ్రైన్లు, ఇంటింటి నీటి కొళాయి కనెక్షన్లు, కమ్యూనిటీ భవనాల నిర్మాణాలు తదితర మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రాధాన్యత ప్రతిపాదనల తయారీపై చర్చించారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు పైన తెలిపిన విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని, తద్వారా వాటిని ప్రభుత్వానికి నివేదించి నిధుల మంజూరును కోరటం జరుగుతుందని తెలిపారు. అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనల్లో ఆయా పను...

ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు

మచిలీపట్నం: వచ్చే మే నెల 1 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలంలో డాక్టర్ ఎల్ వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థను ప్రారంభిస్తున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ వీ. విద్యాసాగర్ నాయుడుతో కలిసి మండల కేంద్రమైన గుడ్లవల్లేరు లోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో హేలీప్యాడ్ నిర్మాణం పనులను పరిశీలించారు.  అప్రోచ్ రహదారి, బారికేడింగు, హెలిప్యాడ్ సజావుగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు.  అనంతరం వారు సమీపంలో దాతల సహాయంతో నిర్మించిన ఎల్వి ప్రసాద్ వైద్య విజ్ఞాన సంస్థ భవనాన్ని సందర్శించారు.   వారు భవనం మొత్తం కలియతిరిగి ఔట్ పేషెంట్ విభాగాలు కౌన్సిలింగ్, రోగనిరోధక గదులు, వివిధ రకాల వార్డులు పరిశీలించారు. ముఖ్యమంత్రి రాకపోకలకు సంబంధించి బాధ్యులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.  ఎక్కడ ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందో...

జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలి – జిల్లా కలెక్టర్ డీకే బాలాజి

మచిలీపట్నం:  పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా సహకారాన్ని అందిస్తున్నాయని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. మంగళవారం కలెక్టరేట్‌లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో ఆయన జిల్లా పరిశ్రమలు ఎగుమతులు ప్రోత్సాహక మండలి సమావేశం నిర్వహించి, జిల్లాలో పరిశ్రమల స్థాపన, పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరుతూ, వారికి అవసరమైన అన్ని అనుమతులను సింగిల్ డెస్క్ పాలసీ కింద మంజూరు చేయడమే కాకుండా ప్రభుత్వ రాయితీలు అందిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. సింగిల్ డెస్క్ పాలసీ కింద జిల్లాలో మొత్తం 628 దరఖాస్తులు రాగా, అందులో 606 దరఖాస్తులకు అన్ని రకాల అనుమతులు మంజూరు చేసి ఆమోదించామన్నారు. పెండింగ్‌లో ఉన్న 22 దరఖాస్తులను తక్షణం పరిశీలించి పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి అనుకూల వాతావరణాన్ని కల్పిస్తూ, పెట్టుబడిదారులకు ఎ...

జిల్లా ప్రజా పరిషత్ లో పలువురు ఉద్యోగులకు పదోన్నతులు

మచిలీపట్నం :  జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పల హారిక ఆద్వర్యంలో ది.28-04-2026న జిల్లా ప్రజా పరిషత్ యాజమాన్యంలో పనిచేయుచున్న ఆరుగురు జూనియర్ అసిస్టెంట్ లకు సీనియర్ అసిస్టెంట్ లుగా, రికార్డు అసిస్టెంట్/ల్యాబ్ అసిస్టెంట్/లైబ్రరీ అసిస్టెంట్ లుగా పనిచేయుచున్న ఆరుగురు జూనియర్ అసిస్టెంట్ లుగా పదోన్నతి కల్పించినారు.   కారుణ్య నియామకం ద్వారా ఐదుగురు జూనియర్ అసిస్టెంట్ లుగా ఏడుగురు టైపిస్ట్ లుగా జిల్లా ప్రజా పరిషత్ యాజమాన్యంలోని వివిధ కార్యాలయముల నందు నియమించుచూ ఉత్తర్వులు జారీచేసియున్నారు.   వీరందరికి నియామక ఉత్తర్వులను జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పల హారిక  చేతుల మీదగా అందచేయుట జరిగినది.   ఈ కార్యక్రమములో డా. జె. అరుణ , ముఖ్య కార్యనిర్వహణాధికారి, డా. ఆర్.సి. ఆనంద్ కుమార్ , ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి వార్లు మరియు ఎస్టాబ్లిష్మెంట్ పరిపాలనాదికారి & సిబ్బంది పాల్గోనియున్నారు.

డిజిటల్ లిటరసీ & ఇన్నోవేషన్ కార్యక్రమంపై అవగాహన సదస్సు

మచిలీపట్నం : కృష్ణా విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల విద్యార్థుల కోసం జాతీయ విద్యా విధానం ( ఎన్ ఈ  పి  2020) ఆధ్వర్యంలో “డిజిటల్ లిటరసీ & ఇన్నోవేషన్” కార్యక్రమంపై అవగాహన సదస్సు మంగళవారం అకడమిక్ బ్లాక్ నందు నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం విద్యార్థులకు డిజిటల్ పద్ధతులు, సాంకేతికత ఆధారిత బోధన-అభ్యాస విధానాలపై అవగాహన కల్పించడం, విద్యా పరిపాలనలో డిజిటల్ మార్పులను సమర్థవంతంగా వినియోగించేలా ప్రోత్సహించడం. ఈ సందర్భంగా ప్రత్యేకంగా “అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ( ఏ బి సి )” పై అవగాహన కల్పిస్తూ, దాని ప్రాముఖ్యత, ప్రయోజనాలు, అమలు విధానం గురించి విద్యార్థులకు వివరించబడింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి డా. బాబు రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, డిజిటల్ పరిజ్ఞానం ప్రస్తుత కాలంలో ఎంతో అవసరమని, ఎన్ ఈ పి 2020 ద్వారా విద్యార్థులకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఎన్ ఈ పి సార్ధి సమన్వయకర్త డా. సుశీల సమన్వయం చేశారు. అలాగే  ఎన్ ఈ పి సార్ధి  సభ్యులు ఎస్ రూపా జెస్సికా...