Skip to main content

పెనమలూరు జెడ్పీ హైస్కూల్లో మధ్యాహ్న భోజనం పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర.

- అత్యంత నాణ్యంగా మధ్యాహ్న భోజనం

- ప్రతి విద్యార్ధికి సరైన పోషకాహారం అందించేలా ఏర్పాట్లు
- సన్నబియ్యం, ఆకుకూరలతో ప్రత్యేక భోజనం
- 155 కేంద్రాల్లో సెంట్రలైజ్డ్ కిచెన్‌ ద్వారా నాణ్యమైన ఆహారం

మచిలీపట్నం :

 ప్రభుత్వ స్కూళ్లలో చదివే ప్రతి పిల్లవానికి నాణ్యమైన భోజనం అందించే లక్ష్యంతో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు పెనమలూరు నియోజకవర్గం పెనమలూరు జిల్లా పరిషత్ హైస్కూల్‌ను స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తో కలిసి మంత్రి పరిశీలించారు. స్కూల్ స్టోర్ రూం పరిశీలించి సరుకుల నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. భోజనం నాణ్యతను దగ్గరుండి పరిశీలించారు. పిల్లలతో కలిసి భోజనం చేశారు. అనంతరం స్కూల్లో విద్యార్ధులు రూపొందించిన పలు ప్రాజెక్టులను పరిశీలించారు.

 గత ఐదేళ్లు మధ్యాహ్న భోజనం అంటేనే విద్యార్ధులు భయపడే పరిస్థితి దాపురించింది. రేషన్ బియ్యంతో అన్నం వండడంతో ముద్దలుగా మారి తినడానికి ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సన్నబియ్యంతో కూడిన ప్రత్యేక మెనూ ప్రకటించాం. ప్రతి విద్యార్ధికి అన్ని రకాల పోషకాలతో కూడిన ఆహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. 155 కేంద్రాల్లో సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేసి ప్రతి స్కూల్కు ఆహారం పంపిస్తున్నాం. ఇందుకోసం ప్రతి ఏటా రూ.2161 కోట్ల బడ్జెట్ కేటాయించడం హర్షణీయం. ప్రైవేటు స్కూళ్లతో సమానంగా ప్రభుత్వ స్కూళ్లలో సదుపాయాలు కల్పిస్తున్నాం. తాగునీటి కాలుష్యానికి చోటు లేకుండా ఆర్వో ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నాం. కాలం చెల్లిన గుడ్లు అందే అవకావం లేకుండా ఒక్కో వారం ఒక్కో రంగుతో గుడ్లు అందిస్తున్నాం.

 రాష్ట్రంలో విద్యా వ్యవస్థపై మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక శ్రద్ద పెట్టి.. సమూలమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. అధికారంలోకి రాగానే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశారు. తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్ధికి రూ.15 వేల చొప్పున ఆర్ధిక సాయం అందించారు. చాగంటి కోటేశ్వరరావు గారిని ఎథిక్స్ కమిటీ ఏర్పాటు చేసి విద్యార్ధులకు విలువలు నేర్పిస్తున్నాం. 16 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపైనా ప్రత్యేక చర్యలు తీసుకునేలా చొరవ చూపిస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...