Skip to main content

వీధి కుక్కల అరాచకం - ఉపాధ్యాయునికి తీవ్ర గాయాలు

మచిలీపట్నం :

వీధి కుక్కల అరాచకం వల్ల ఒక ఉపాధ్యాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. సోమవారం ఉదయం స్కూలుకు వెళ్తున్న శేషగిరిరావు పై వీధి కుక్కలు వెంటపడ్డాయి. ఒకటో, రెండో అంటే పర్వాలేదు. కొంతమేర తప్పించుకోవచ్చు. దాదాపు నాలుగు కుక్కలు పైగా విచక్షణ మరిచి వెంట పడటంతో, తన స్కూటీపై వెళ్తున్న మాస్టారు వాటిని తప్పించబోయి, అదుపుతప్పి రోడ్డు మీద పడ్డాడు.  చుట్టుపక్కల జనం కుక్కల్ని తరిమి కొట్టారు. కాలు చీలమండ దగ్గర వేలాడుతూ రక్తం కారుతుండటంంతో వెంటనే 108 కి ఫోన్ చేశారు. అంబులెన్స్ వచ్చి హుటాహుటిన ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. వీధి కుక్కల వల్ల కాలు  ప్రమాదంలో పడ్డ ఆ మాస్టారు పెడన మండలం ఉరిమి ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న శేషగిరిరావు అని తెలిసింది. 

వీధి కుక్కల ఆటలకు కట్టడి లేదా? 

ఇటీవల సుప్రీంకోర్టు కూడా వీధి కుక్కల్ని నగరానికి దూరంగా కట్టడి చేయాలని తీర్పు ఇవ్వడం జరిగింది.

పట్టించుకోని నగరపాలక సంస్థ: 

వీధి కుక్కల నియంత్రణకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాలి. నగరంలో ఇటీవల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ప్రక్రియ మందగించిందని చెప్పవచ్చు. వీధి కుక్కల్ని ఇప్పటికైనా ప్రత్యేక షెల్టర్లలో నగరానికి దూరంగా ఉంచి, ప్రజలపై వీధి కుక్కలు స్వైర్య విహారం చేయకుండా కాపాడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ఆ చర్యలేమి చేపట్టక పోగా వీధి కుక్కల నియంత్రణలో నగరపాలక సంస్థ సిబ్బంది పూర్తిగా విఫలం అయ్యారని నగర ప్రజలు అనుకోవడం గమనార్హం. ప్రజల భద్రతపై మరీ ఇంత నిర్లక్ష్యమా? ఇది పరిపాలన వైఫల్యం కాదా? అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా నగరపాలక సంస్థ సిబ్బంది స్పందించి వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత భయంకరంగా మారుతుంది. పన్నులు కడుతున్న ప్రజలకు రక్షణ ఇవ్వలేని అధికారులు ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు. నగరపాలక సంస్థ కుక్కల నియంత్రణకు ప్రణాళిక ప్రకారం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...