Skip to main content

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పై ప్రజలకు సరైన అవగాహన కలిగించాలి : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

మచిలీపట్నం :

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు కార్యక్రమాలపై ప్రజలకు సరైన అవగాహన కలిగించాలని వారిలో సానుకూల దృక్పథం వ్యక్తమవ్వాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. 

సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని మీకోసం సమావేశం మందిరంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందితో వివిధ ప్రభుత్వ పథకాలపై ప్రజల స్పందన పై సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై ప్రజల అభిప్రాయం సేకరిస్తుందన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో బాలింతలకు, గర్భవతులకు టేక్ హోమ్ రేషన్ పథకం కింద పోషకాహారం అందజేస్తుందన్నారు. ఈ విషయమై ప్రతి అంగన్వాడీ కార్యకర్త, లబ్ధిదారులకు వారి తల్లిదండ్రులకు సరైన అవగాహన కలిగించాలన్నారు.
ఆర్టిజిఎస్ నుండి అభిప్రాయం సేకరించినప్పుడు వాస్తవ విషయాలు తెలియజేసే విధంగా వారిని చైతన్య పరచాలన్నారు. 
అంగన్వాడీ కేంద్రం ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు తప్పనిసరిగా తెరిచి ఉంచాలని అక్కడికి వచ్చే వారికి తాగునీరు సౌకర్యం అందుబాటులో ఉండాలని, కోడిగుడ్డు, పాలు సక్రమంగా పంపిణీ అయ్యేలా చూడాలన్నారు. అంతేకాకుండా పాలు, గుడ్డు, బాలామృతం నాణ్యతగా ఉండేలా చూసుకోవాలన్నారు. 
దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లను సంబంధిత వినియోగదారుల ఇంటి వద్ద పంపిణీ చేసే గ్యాస్ ఏజెన్సీ తరఫున ఉండే వ్యక్తుల ప్రవర్తన బాగుండాలని, మర్యాదపూర్వకంగా వినియోగదారులతో మాట్లాడాలని, నిర్ణీత ధర కంటే ఎక్కువగా పైకము వసూలు చేయరాదన్నారు. ధరల దుకాణంలో పంపిణీ చేసే బియ్యము వగైరా ఆహార వస్తువులు నాణ్యతగా ఉండాలన్నారు. 

మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహారం చిక్కి కోడిగుడ్డు నాణ్యతగా ఉండాలన్నారు. ఏ ఆహార పదార్థాలు విద్యార్థులకు ఇస్తున్నారో వాటిపై వారి తల్లిదండ్రులకు సరిగా అవగాహన కలిగించాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రతి ఇంటి నుండి చెత్త సేకరణ తప్పనిసరిగా జరగాలన్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చే అర్జీదారులతో మర్యాదపూర్వకంగా సహాయ పూర్వకంగా మెలగాలన్నారు. 

గ్రామ వార్డు సచివాలయాల్లో కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారితో మర్యాదపూర్వకంగా మాట్లాడాలన్నారు. అర్జీదారులకు సరిగా ఎండార్స్మెంట్ ఇచ్చినప్పటికీ అందుకు సంబంధించిన ఐచ్చికాన్ని ఎంపీక చేసుకోవడంలో తప్పులు దొర్లకుండా జాగ్రత్త వహించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని డాక్టర్లు అందుబాటులో ఉండి రోగులకు సరైన వైద్యం అందించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో రోగుల సంక్షేమమే చాలా ముఖ్యమని వారికి అందుబాటులో ఉన్న మందులను ఉచితంగా అందజేయాలన్నారు.

ప్రజలకు సేవలు అందించే ప్రతి ఒక్క ఉద్యోగి ఎవరైనా తప్పులు చేస్తుంటే వాటిని వెంటనే సరిదిద్దుకోవాలన్నారు.
రెవెన్యూ అంశాలకు సంబంధించి పరిష్కరించాలని. ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే ఆ వ్యక్తికి నోటీసు ఇచ్చి విచారణ జరిపి ఆలస్యం చేయక వెంటనే నివేదిక ఇచ్చేందుకు కృషి చేయాలన్నారు.

ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, మీకోసం నోడల్ అధికారి విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ పోతురాజు, ఐ సి డి ఎస్ పిడి ఎంఎన్ రాణి, డీఎస్ఓ మోహన్ బాబు, డి ఎం హెచ్ ఓ డాక్టర్ యుగంధర్, డి సి హెచ్ ఎస్ డాక్టర్ శేషు కుమార్, జి ఎస్ డబ్ల్యూ ఎస్ జిల్లా సమన్వయకర్త రవికాంత్, విద్యాశాఖ ఏడి విద్యాలత, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ నిఖిల శ్రీ, పలువురు సచివాలయ కార్యదర్శులు, అంగన్వాడీ కార్యకర్తలు, గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు, చౌక దుకాణాల డీలర్లు, ఎంఈఓ లు, వైద్యాధికారులు పాల్గొన్నారు. 

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...