Skip to main content

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి: పి ఆర్ టి యు ఉమ్మడి కృష్ణాజిల్లా

మచిలీపట్నం :

పి ఆర్ టి యు రాష్ట్ర అధ్యక్షులు మిట్టా కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి ఏ గిరి ప్రసాద్ రెడ్డి, పిలుపుమేరకు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ఈనెల 21వ తేదీన ధర్నా నిర్వహిస్తున్నామన్నారు.
ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని పిఆర్టియు కృష్ణ, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నవాబ్ జాని, పెద్దిబోయిన శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి సోలా రాఘవరాజు, జిల్లా కార్యనిర్వహక అధ్యక్షులు కోసూరి రాజశేఖర్ ఒక ప్రకటనలో కోరారు. 2018 జులై డి ఏ ఒక్కటే రిలీజ్ చేయడం జరిగిందని, 2019 జనవరి నుండి పెండింగ్ లో ఉన్న రావలసిన డిఎ ఎరియర్లు, 11వ పిఆర్సి ఎరియర్లు, 12వ పిఆర్సి ఏర్పాటు తదితర పనులన్నీ ప్రభుత్వం వేగవంతంగా చేపట్టాలని కోరారు. రాజమహేంద్రవరంలో జరిగిన రాష్ట్ర పిఆర్టియు కార్యనిర్వాహక సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్ గాదె శ్రీనివాసులు నాయుడు పిఆర్టియు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మిట్టా కృష్ణయ్య, ఎ.యం. గిరి ప్రసాద్ లకు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం వెంటనే పిఆర్సి కమిటీ వేయాలని 30 శాతం ఇంటీరియమ్ రిలీఫ్ ప్రకటించాలని, కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సరెండర్ లీవ్ బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న ఈ ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 21వ తేదీన అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు 25వ తేదీన విజయవాడ ధర్నా చౌక్ నందు ధర్నా చేపడుతున్నామన్నారు. 
రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మర్రి ప్రభాకర్, బలుసుపాటి మల్లికార్జునరావులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...