మచిలీపట్నం:
గుర్రపు డెక్కతో తయారుచేసిన వివిధ రకాల హస్తకళాకృతులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని అందుకు తగ్గట్టుగా వాటిని సరఫరా చేసేందుకు మహిళలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు.
మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ పెడన మండలంలోని చేవేండ్ర గ్రామము, బంటుమిల్లి మండలంలోని మనిమేశ్వర పంచాయతీలోని లేల్లగూడెంలో ఆకస్మికంగా పర్యటించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ అక్కడ సేర్ఫ్, డి ఆర్ డి ఏ, వెలుగు ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు గుర్రపుడెక్కతో వివిధ హస్త కళాకృతుల తయారీలో శిక్షణ ఇస్తున్న నైపుణ్య అభివృద్ధి కేంద్రాలను పరిశీలించారు.
అక్కడి మహిళలతో జిల్లా కలెక్టర్ మమేకమై మాట్లాడుతూ అస్సాం నుంచి కళాకారులను జిల్లాకు పిలిపించామని మచిలీపట్నం మండలంలోని చిన్నాపురం గ్రామంలో స్వయం సహాయక సంఘాల మహిళలు 30 మందికి గుర్రపు డెక్క తో వివిధ రకాల బుట్టలు, చాపలు వంటి హస్త కళాకృతులు తయారు చేయుటలో శిక్షణ ఇప్పించామన్నారు.గత ఒకటిన్నర సంవత్సరం పైగా నడుస్తోందన్నారు. శిక్షణ ఇప్పించడం సులువవుతుందని దాన్ని మార్కెటింగ్ చేయడానికి ఏమైనా కష్ట పడవలసి వస్తుందని తాను భావించానన్నారు. కానీ అది తిరగబడిందని కొనేదానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారని, వారు ఆర్డర్ ఇస్తే అందుకు అనుగుణంగా ఇచ్చిన తేదీలోగా వస్తువులు సరఫరా చేయలేకపోతున్నామన్నారు.
ఇందుకు కారణం కొద్దిమంది మహిళలే వస్తువులు తయారు చేయడం వలన ఇబ్బంది ఎదురవు తుందన్నారు. ఈ పరిస్థితులను అధిగమించడానికి కేవలం చిన్నాపురం మహిళలకే పరిమితం కాకుండా జిల్లా వ్యాప్తంగా ఎక్కువ మంది మహిళలకు శిక్షణ ఇవ్వాలని నిశ్చయించామన్నారు. ఇందులో భాగంగానే జిల్లాలో 1000 మంది మహిళలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.
చిన్నాపురంలో ఇదివరకే శిక్షణ పొందిన మహిళల చేతనే మిగతా వారికి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు.కేవలం 20 రోజుల్లోనే బుట్టలు, చాపలు వంటి అల్లికలు నేర్చుకోవడం ఆశ్చర్యంగా ఉందని చాలా బాగా చేశారని కలెక్టర్ మహిళలను అభినందించారు.
ప్రస్తుతం చేతిలో 20 లక్షల రూపాయల మేరకు ఆర్డర్ ఉందన్నారు. ప్రభుత్వము నుండి ఆర్డర్ తీసుకున్నాం గనుక ఆలస్యమైన వారికి నచ్చజెప్పి ఆర్డర్ను నిలబెట్టుకున్నామన్నారు.
కొద్ది రోజులు ఓపిక పడితే తర్వాత మళ్లీ మళ్లీ ఆర్డర్లు వస్తాయన్నారు. బెంగళూరు, హైదరాబాదులో ఉన్న కంపెనీలు దసరా, క్రిస్మస్ నూతన సంవత్సరాలకు వారి ఉద్యోగులందరికీ బహుమతులు ఇచ్చేందుకు గుర్రపు డెక్క పెట్టెలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.
అనంతరం కలెక్టర్ లేల్లగూడెంలో 9వ తరగతి విద్యార్థులతోనూ, వాలంటీర్లతోనూ ముఖాముఖి మాట్లాడారు. ఉదయాన్నే లేచి చదువుకుంటున్నారా లేదా పదో తరగతి పాఠ్యపుస్తకాలు అందాయా లేదా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల్లో కొంతైనా మార్పు వచ్చిందా లేదా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట డిఆర్డిఏ పిడి హరి హరినాథ్, తహసిల్దారు అనిల్ కుమార్ పలువురు స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.
Comments
Post a Comment