Skip to main content

ఇంటి కూల్చివేత ఘటనలో చట్టాలను పాటించలేదు: న్యాయవాది చంద్రాల గోపికృష్ణ

మచిలీపట్నం : 

స్థానిక కొబ్బరి తోటలో జనసేన కార్యకర్త శ్రీపతి వెంకటాచలం ఇంటి కూల్చివేత ఘటనపై సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బాధితుడు తరపు న్యాయవాది చంద్రాల గోపికృష్ణ పాల్గొని సవివరంగా మాట్లాడారు.

చట్టాలను, గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించకుండా అన్యాయంగా శ్రీపతి వెంకటాచలంకి చెందిన ఇంటిని మున్సిపల్ అధికారులు కూల్చివేశారని న్యాయవాది గోపికృష్ణ తెలిపారు.

జస్టిస్ గవాయ్ జస్టిస్ కె వి విశ్వనాథం నేతృత్వంలోని గౌరవ సుప్రీంకోర్టు అందించిన బుల్ డోజర్ జస్టిస్ తీర్పును అనుసరించి కొబ్బరి తోట ఇంటి నిర్మాణ కూల్చివేత ఘటనలో బాధితుడు శ్రీపతి వెంకటచలం కు నష్టపరిహారం అందించాలన్నారు.

కార్పొరేషన్ కమిషనర్ కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారన్నారు. శ్రీపతి వెంకటాచలానికి చెందిన ఇంటిని కూలదొయడం చట్ట, రాజ్యాంగ వ్యతిరేకమన్నారు.

కొబ్బరి తోటలోని 1.59 ఎకరాల వెంచర్ లో మనిషికో రకంగా అనుమతులు కల్పిస్తూ, గౌరవ కోర్టులను సైతం అయోమయానికి గురి చేసేలా నగరపాలక సంస్థ కమిషనర్ వ్యవహరిస్తున్నారన్నారు.

కొబ్బరి తోట వెంచర్ కు సంబంధించిన ఇంటి నిర్మాణాలలో కృష్ణాజిల్లా జూనియర్ సివిల్ కోర్టులో ఒకలా, గౌరవ హైకోర్టులో మరోలా నివేదికలు అందిస్తూ గౌరవ కోర్ట్ లను సైతం నగరపాలక సంస్థ కమిషనర్ తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.

ఓ ఎస్ నెంబర్ 409/2025 కృష్ణాజిల్లా జూనియర్ సివిల్ కోర్టులో శ్రీపతి వెంకటాచలానికి సంబంధించిన కేసు లో ఒకలా, ఓ ఎస్ నెంబర్ 3328/2024 గౌరవ హైకోర్టులో తోట నరేంద్ర కు చెందిన కేసులో మరోలా నగరపాలక సంస్థ కమిషనర్ వ్యవహరించడం కోర్టులను తప్పుదోవ పట్టించడమేనన్నారు.

కొబ్బరి తోట వెంచర్ లో తమకు హక్కు ఉందంటూ కొండపల్లి వారు చేస్తున్న వాదనలలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు.

1941 నుండి 2026వ సంవత్సరం వరకు సుమారు 85 సంవత్సరాలు పాటు కొండపల్లి కి సంబంధించిన వారికి భూమికి ఎటువంటి సంబంధం లేదని పలు దఫాలుగా గౌరవ కోర్టులలో ప్రతికూలంగా తీర్పులు వచ్చాయన్నారు.

1964 సంవత్సరంలో కొండపల్లి కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి కొబ్బరి తోట వెంచర్ కి సంబంధించిన భూమిని విక్రయించి తద్వారా సొమ్మును పొందినట్లుగా గౌరవ కోర్టులో అంగీకరించడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.   

కనీసం చట్టాలపై గౌరవం లేకుండా అన్యాయంగా తన క్లైంట్ శ్రీపతి వెంకటాచలం కు చెందిన ఇంటిని కూలదొసిన మున్సిపల్ అధికారులు వారికి సహకరించిన పోలీస్ సిబ్బందిపై న్యాయపరంగా పోరాటం చేయడం తథ్యం అన్నారు. బాధితుడు వెంకటాచలంకు నష్టపరిహారం అందించే లాగా కృషి చేస్తామన్నారు.

కోర్టు అనుమతులతోనే కొబ్బరి తోట ఇంటిని కూల్చాం అంటున్న అధికారులు దానికి సంబంధించిన పత్రాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

చట్టాలపై గౌరవం లేకుండా అధికారులు మెప్పుల కోసం పొంతన లేని విధానాలను అవలంబిస్తే తిప్పలు పడతారన్నారు. ఇప్పటికైనా వాస్తవాలను గుర్తించుకోవాలన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...