Skip to main content

వ్యవసాయానికి బలం, రైతులకు భరోసా – కేడీసీసీ బ్యాంక్ : కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్, ఎమ్మెల్యే బోడే ప్రసాద్

ఉయ్యురు :

పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరు పట్టణంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం నూతన భవనాన్ని కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్, ఎమ్మెల్యే  బోడే ప్రసాద్  ప్రారంభించారు. ఈ కార్యక్రమం సహకార సంఘం అధ్యక్షులు వాసు కూనపరెడ్డి ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగింది.
ఈ సందర్భంగా కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్  మాట్లాడుతూ సహకార రంగం రైతులకు నిజమైన ఆర్థిక భరోసా కల్పించే బలమైన వేదికగా మారిందని తెలిపారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో సహకార బ్యాంకు, సహకార సంఘాల ఆధ్వర్యంలో పాడి పరిశ్రమ, వ్యవసాయం, అనుబంధ రంగాలలో ప్రజలకు తక్కువ వడ్డీతో రుణ సదుపాయాలు కల్పిస్తూ వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడేలా కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా వ్యవసాయ రుణాలు మరియు మహిళా సంఘాలకు  రుణాలు అందిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో, రాష్ట్రంలో కృష్ణాజిల్లా సహకార బ్యాంకు మొదటి మూడు స్థానాల్లో నిలవడం గర్వకారణమని తెలిపారు.
అన్ని సహకార సంఘాల్లో కంప్యూటరైజేషన్ పూర్తి అయ్యిందని, రైతులు ఈ సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే పీఎంఈజీపీ (PMEGP) పథకం ద్వారా యువత స్వయం ఉపాధి అవకాశాలను విస్తరించుకుని వ్యాపారాల్లో ముందుకు రావాలని సూచించారు. కేడీసీసీ బ్యాంకును వాణిజ్య బ్యాంకులకు ఏమాత్రం తగ్గకుండా మరింత అభివృద్ధి పరచడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. బ్యాంకు సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించడం వల్లే ఈ స్థాయికి చేరుకున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  నాయకత్వంలో సహకార రంగం మరింత అభివృద్ధి చెందుతోందని అన్నారు.

ఎమ్మెల్యే  బోడే ప్రసాద్  మాట్లాడుతూ ఉయ్యూరు ప్రాథమిక సహకార పరపతి సంఘం కార్యాలయాన్ని రూ.49 లక్షల వ్యయంతో నిర్మించడం అభినందనీయం అని తెలిపారు. ఈ భవనం ద్వారా రైతులకు సేవలు మరింత అందుబాటులోకి రావడంతో పాటు,  ఏర్పాటు చేసిన దుకాణాల ద్వారా అద్దె ఆదాయం పొందే అవకాశంతో సంస్థ ఆర్థికంగా బలపడుతుందని, పరిపాలన సౌలభ్యం కోసం అవసరమైన మౌలిక వసతులకు నిధులు సమకూర్చుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. రైతులు, ఆర్థికంగా బలహీన వర్గాల ప్రజలకు రూ.30 వేల నుండి రూ.20 లక్షల వరకు రుణాలు అందించడం ద్వారా వారి ఆదాయాలు పెరిగేలా కృషి చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ రుణాలు, డ్వాక్రా రుణాల కింద మొత్తం ₹10 కోట్ల విలువైన రుణ చెక్కులను కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్ , ఎమ్మెల్యే బోడే ప్రసాద్  100 మందికి పైగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ ఆర్థిక సహాయం రైతులు, మహిళా సంఘాలకు మరింత ధైర్యం, ఆత్మవిశ్వాసం కలిగిస్తుందని తెలిపారు.
అనంతరం చైర్మన్ నెట్టెం రఘురామ్ ఉయ్యూరు బ్రాంచ్‌ను సందర్శించి, బ్యాంకు సేవలపై ప్రజలతో నేరుగా మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. బ్రాంచ్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...