Skip to main content

ఉచిత విద్యుత్ పథకం నేతన్నల ఆర్థిక భరోసా కు దోహదపడుతుంది : రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం:

రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత విద్యుత్ పథకం నేతన్నల ఆర్థిక భరోసా కు ఎంతగానో దోహదపడుతుందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

బుధవారం ఉదయం మంత్రివర్యులు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ లతో కలిసి నగరంలోని 29వ డివిజన్ చింతగుంటపాలెంలో పర్యటించి 5 మంది చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించే ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. మంత్రి స్వయంగా మగ్గం గుంతలో కూర్చుని మగ్గం నేయడం అందరిని విశేషంగా ఆకట్టుకుంది. ధ్రువీకరణ పత్రాలు అందుకున్న వారిలో పృద్వి వెంకటేశ్వరరావు, ఎర్ర రామలింగేశ్వర రావు, ఆకురాత సులోచన, భూసం లత, ఉమ్మటి మహేశ్వర రావు ఉన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రివర్యులు మాట్లాడుతూ చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకాన్ని ఏప్రిల్ 1వ తేదీ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందన్నారు.
చేనేత, మరమగ్గాల రంగాలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుందన్నారు. ఇందులో భాగంగా చేనేత మగ్గాలకు 200 యూనిట్ల వరకు, మర మగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు సౌకర్యం కల్పించిందన్నారు.

సుమారు 93 వేల చేనేత కార్మిక కుటుంబాలు, 11,488 మరమగ్గాల యూనిట్లకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతోందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం 150 కోట్ల రూపాయల మేరకు ఖర్చు భరిస్తోందన్నారు. సగటున ఒక్కో చేనేత కుటుంబానికి నెలకు 780 రూపాయల మేరకు విద్యుత్ శాఖ బిల్లు కలిసి వస్తోందన్నారు. 
మచిలీపట్నం నియోజకవర్గంలో పట్టణ ప్రాంతంలోనీ చింతగుంటపాలెం, గొడుగుపేటలలో 122 చేనేత కుటుంబాలు ఉన్నాయని, చిన్నాపురంలో మరో 160 చేనేత కుటుంబాలు ఉన్నాయన్నారు. చేనేత కార్మికులకు 50 సంవత్సరాలకే పింఛను మంజూరు చేస్తున్నామన్నారు

తమ ప్రభుత్వం 2014-19 లో 100 కోట్ల రూపాయల మేరకు రుణాలను మాఫీ చేసి చేనేత సంఘాల ఆర్థిక బలోపేతానికి కృషి చేసిందన్నారు. అంతేకాకుండా చేనేత వస్త్రాల నిల్వలు ఉండడంతో ప్రత్యేక తగ్గింపు ధరలతో ఆప్కో ద్వారా కొనుగోలు చేసి ఆదుకోవడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం రంగులు, వర్క్ షెడ్డు వంటి వాటికి ఆర్థిక సహాయం గతంలో అందించేదని, గత ప్రభుత్వ కాలంలో అవన్నీ కనుమరుగయ్యాయని, , వాటిని దశలవారీగా పునరుద్ధరించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
అనంతరం మంత్రి ప్రభుత్వం ఎలా ఉందని ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్లు బస్సు ఉచిత బస్సు ప్రయాణం...స్త్రీ శక్తి పథకం, తల్లికి వందనం తదితర పథకాల ఎలా ఉన్నాయని ప్రజలను కోరగా అందరూ బాగున్నాయని చెప్పడం చెప్పుకోదగ్గ విశేషం. ఒక మహిళ తనకు గ్యాస్ డబ్బులు రాలేదని చెప్పడంతో వెంటనే మంత్రి స్పందించి ఆమెకు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తూ వెంటనే వారి బ్యాంకు ఖాతాను అనుసంధానం అయ్యేలా చూడాలని మునిసిపల్ అధికారులకు సూచించారు.

ఆర్ టి సి చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ చేనేత వృత్తినే నమ్ముకుని చాలామంది కొనసాగుతున్నారన్నారు. వారి శ్రమను గౌరవించి వారి కుటుంబాలను బలోపేతం చేసి వస్త్ర రంగాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, మునిసిపల్ కమిషనర్ బాపిరాజు, చేనేత శాఖ అభివృద్ధి అధికారులు రామయ్య, లోకేష్, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు విద్యాసాగర్, మునిసిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, స్థానిక నాయకులు వెంకటస్వామి, సత్యనారాయణ, నారాయణ ఖాజా తదితర అధికారులు అనధికారులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...