Skip to main content

ప్రజా అర్జీల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలి - మీకోసం కార్యక్రమంలో డీఆర్ఓ కే చంద్రశేఖరరావు

మచిలీపట్నం : 

ప్రజల నుంచి అందే అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వేగవంతంగా పరిష్కారం చూపాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) కే చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు.

సోమవారం ఉదయం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో ఆయన ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహించారు. విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ పోతురాజు, సమగ్ర శిక్ష ఏపీసి ఆర్ కుముదిని సింగ్, అవనిగడ్డ డిఎస్పి ఆర్ అభిషేక్ తో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు.సంబంధిత శాఖలకు చేరిన అర్జీలను సమయపాలనతో పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా సేవలు అందించాలని ఆయన తెలిపారు.

ఉద్యోగుల గ్రీవెన్స్ కార్యక్రమంలో అర్జీల స్వీకరణ:

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ముందుగా ఉద్యోగుల గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ కే చంద్రశేఖరరావు ఉద్యోగుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు తమ సమస్యలు, అభ్యర్థనలు వివరించగా, వాటిని పరిశీలించి సంబంధిత శాఖల ద్వారా త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని డీఆర్ఓ తెలిపారు.

 *మీకోసం అర్జీల వివరాలు:* 

ఇంతేరు గ్రామ స్మశానవాటిక భూమి రక్షణకు గ్రామస్థుల వినతి
కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం ఇంతేరు గ్రామానికి చెందిన సర్వే నెం. 89లో ఉన్న స్మశానవాటిక భూమిని కొంతమంది అక్రమదారులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్థులు తెలిపారు. భూ అక్రమదారులు ఆ స్థలంలో తవ్వకాలు చేపట్టగా, గ్రామస్థులు అడ్డుకున్నారు. ఇంతకు ముందు రెవెన్యూ శాఖ సిబ్బంది స్మశానవాటికగా కొలతలు వేసి గ్రామానికి అప్పగించారని, గత 10 సంవత్సరాలుగా ఎటువంటి తవ్వకాలు జరగలేదని గ్రామస్థులు వివరించారు. ప్రస్తుతం అక్రమంగా దొంగపట్టాలు సృష్టించి భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అక్రమదారుల నుంచి స్మశానవాటిక భూమిని రక్షించి తిరిగి గ్రామానికి అప్పగించాలని గ్రామస్థులు అధికారులను కోరారు.

మురుగు కాలువ త్రవ్వకం, ఆక్రమణల తొలగింపుపై వినతి
పెదపట్నం పంట కాలువకు దిగువున ఉన్న ఆత్మాన్ కోడ్ మురుగు కాలువ రెవెన్యూ రికార్డుల ప్రకారం 30 అడుగుల వెడల్పు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 3 అడుగులకే పరిమితమైందని రైతులు తెలిపారు. కాలువపై ఆక్రమణలు జరగడంతో తుపాన్లు, భారీ వర్షాల సమయంలో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీరు సరిగా బయటకు వెళ్లక పంట భూములు ముంపుకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి మురుగు కాలువను పూర్తి స్థాయిలో త్రవ్వకం చేసి, ఎగువ దిగువ ప్రాంతాల రైతులకు నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని, కాలువపై ఉన్న ఆక్రమణలను తొలగించాలని బంటుమిల్లి మండలం, మల్లేశ్వరం గ్రామానికి చెందిన కందుల శ్రీనివాసరావు అర్జీ సమర్పించారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో డాక్టర్ జే అరుణ, ఆర్ అండ్ బి ఈఈ లోకేశ్వరరావు, ఉద్యాన శాఖ అధికారిణి జే జ్యోతి, మత్స్య శాఖ అధికారి అయ్య నాగరాజా, ఐసిడిఎస్ పిడి ఎంఎన్ రాణి, ఎల్డిఎం రవీంద్రారెడ్డి, పశుసంవర్ధక శాఖ అధికారి చిన నరసింహులు, డ్రైనేజీ శాఖ ఈఈ కిరణ్, డిఆర్డిఏ పిడి హరిహరనాథ్, గిరిజన, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులు ఫణి ధూర్జటి, జి రమేష్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...