Skip to main content

శనివారం జిల్లా వ్యాప్తంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర

మచిలీపట్నం :

ఏప్రిల్ 18వ తేదీ శనివారం జిల్లా వ్యాప్తంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా జలం జీవం ఇతివృత్తంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి క్యాంపు కార్యాలయం నుండి స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంపై జిల్లా అధికారులు, క్షేత్ర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి మూడవ శనివారం ఒక ఇతివృత్తాన్ని (థీమ్) ఎంపిక చేసుకొని స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెలకు జలం జీవం ఆంధ్ర ఇతివృత్తంతో కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. 

ఇందులో భాగంగా గ్రామాల్లో తిరిగి వర్షపు నీటి ప్రతి బొట్టును ఓడిసిపట్టేందుకు అన్ని చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం కోనేటి గుంతలు, నీటి తొట్లు, పర్కులేషన్ ట్యాంకులు తదితర వర్షపు నీటి నిలువ నిర్మాణాలు ఏమున్నాయి గమనించుకొని అవసరమైన ప్రదేశంలో వాటి నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. జిల్లాలో 250 చెరువులను ఉపాధి హామీ పథకం కింద పూడికలు తీసే పనులను మంజూరు చేశామని, అలాగే సప్లై ఛానల్ పూడికలు కూడా తీసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అన్ని జల వనరులు పరిశుభ్రంగా నిర్వహించాలని, వాటి చుట్టూ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలన్నారు. అవసరమైన చోటల్లా ఇంకుడు గుంతలు తవ్వాలని ఎక్కడ కూడా మురికినీరు పొరలి రహదారి పైన ప్రవహించకుండా చూడాలన్నారు. 

ఎక్కడైనా మురికి కాలువలు అసంపూర్తిగా ఉంటే వాటిని పూర్తి చేసి వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బందులు లేకుండా ముందుగానే పక్కా మురికి కాలువ గాని లేదా కచ్చా మురికి కాలువ గాని ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ భవనాలలో సజావుగా లేని వర్షపు నీటి నిల్వ నిర్మాణాలను మరమ్మతు చేయించాలని వచ్చే వర్షాకాలం నాటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలన్నారు.

తదుపరి స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమాలను పరిశీలించాలన్నారు. ఇందులో భాగంగా గ్రామాల్లో 250 కుటుంబాలకు ఒక క్లాప్ మిత్రలను ఏర్పాటు చేశామని, క్లాప్ మిత్రాలు కనీసం ఒక టన్ను చెత్త తీసుకొని వస్తేనే వారికి జీతాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. వారు ఇంటింటికి తిరిగి చెత్తను సేకరిస్తున్నారా లేదా అని గ్రామస్తులతో విచారించాలన్నారు.

మండల ప్రత్యేక అధికారులు స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం లో పాల్గొన్న అనంతరం గ్రామంలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలను సందర్శించి అక్కడ ఇంకుడు గుంతలు గాని, కాంపోస్టు గుంతలు గాని ఉన్నాయా లేదా గమనించి లేనిపక్షంలో వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. 

తదుపరి గ్రామంలో రీ సర్వే ప్రక్రియ గురించి ఆరా తీయాలని సంబంధిత రైతులు, సాగుదారులకు రెవెన్యూ శాఖ నుండి నోటీసులు అందాయా లేదా వాళ్లకు తెలిసే సర్వే జరిగిందా లేదా అనే వివరాలు తెలుసుకోవాలన్నారు. 

మండల విద్యాధికారులు, పాఠశాల ప్రత్యేక అధికారులు ఉన్నత పాఠశాలను సందర్శించి పదవ తరగతి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారు ఉదయం 5 గంటలకే నిద్రలేస్తున్నారా లేదా చదువుకుంటున్నారా లేదా అని విచారించాలన్నారు. వారిని ఆ దిశగా మరొకసారి చైతన్య పరచాలన్నారు. 

అంతేకాకుండా వారు ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి నూటికి నూరు శాతం ఫలితాలు సాధించే విధంగా ప్రణాళిక రూపొందించుకునేటట్లు మార్గనిర్దేశం చేయాలన్నారు. ఫౌండేషనల్ లిటరసి న్యూమరసి (ఎఫ్ ఎల్ ఎన్) వాలంటీర్లు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఏమేరకు చదువు నేర్పుతున్నారో గమనించాలన్నారు. 

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జెడ్పి సిఈఓ డాక్టర్ జె అరుణ, జలవనురుల శాఖ ఎస్ ఈ గుణకర్, డ్వామా పిడి శివప్రసాద్, మండల ప్రత్యేక అధికారులుగా ఉన్న జిల్లా అధికారులు, డి ఎల్ డి వో లు, ఎంపీడీవోలు,తహసిల్దార్లు, జలవనరుల శాఖ ఇంజనీర్లు, ఏ పీ డి లు,ఏపీవోలు ఎంఈఓ లు తదితర అధికారులు పాల్గొన్నారు. 

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...