Skip to main content

అమరావతికి చట్టబద్ధత లభించడం వైసీపీకి మింగుడు పడడం లేదు: గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి

మచిలీపట్నం :

రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత లభించడం వైసిపికి ఏమాత్రం మింగుడు పడడం లేదని కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి అన్నారు.

నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరంకి గురుమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర రాజధాని అమరావతిపై వైసీపీ నాయకులు విషం కక్కుతున్నారన్నారు. వైసీపీ అధినేత తలా తోక లేని విధంగా వ్యవహరిస్తూ మావిగన్ పేరుతో రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారన్నారు. మచిలీపట్నం విజయవాడ గుంటూరు ప్రాంతాలను 2014లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిఆర్డిఏ పరిధిలోకి తీసుకువచ్చారన్నారు. సి ఆర్ డి ఏ పరిధిలోకి తీసుకురావడం అంటే ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని గురుమూర్తి చెప్పారు. కనీస అవగాహన లేనివిధంగా వైసిపి పార్టీ అధినేత, అలాగే పార్టీ నాయకులు వ్యవహరించడం సిగ్గుచేటు అన్నారు

 రాజకీయ నటనలో కమల్ హాసన్ ను మించిపోతున్న మాజీ మంత్రి పేర్ని నాని రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వంపై అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకునే పనిలో ఉన్నారన్నారు. కనీస స్థాయిలేని వైసీపీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రపంచంలో ఒక్క వైసీపీ పార్టీకి, ఆ పార్టీ నాయకులకు తప్ప మిగిలిన వారంతా రాష్ట్రానికి అమరావతి రాజధాని కావడం పట్ల హర్షిస్తున్నారన్నారు. ఐదేళ్ల వైసిపి పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వైసీపీ నాయకులు సిగ్గు శరం లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నా సంక్షేమం అభివృద్ధి విషయంలో వెనకడుగు వేయకుండా పాలన చేస్తున్న కూటమి ప్రభుత్వంపై నిత్యం బురదజల్లే ప్రయత్నాలకు పాల్పడుతున్నారన్నారు. 

వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన మంత్రి నారా లోకేష్ పై ఆరోపణలు చేయడం వారి విజ్ఞత లేని విధానాలకు నిదర్శనం గా పేర్కొన్నారు.తల్లకిందులుగా తపస్సు చేసినా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోలేరని రాజధాని అమరావతి విషయంలో వైసిపి నాయకుల చేష్టలు చిన్నపిల్లల బొమ్మలాటగా మారిందన్నారు.ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని మీకు మరోసారి బుద్ధి చెప్పడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని గురుమూర్తి స్పష్టం చేశారు. 250 మందితో తెలుగుదేశం పార్టీ జాతీయ రాష్ట్ర కార్యవర్గాలను ఏర్పాటు చేస్తే ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి 30 మందికి అవకాశం లభించటం హర్షణీయమన్నారు. వీరంతా పార్టీ బలోపేతానికి కృషి చేస్తారనే నమ్మకంతోనే పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. 
ఇందుకుగాను కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతూ కార్యవర్గాల్లో నాయకులందరికీ అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. 

తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వైసిపి నాయకులు తట్టుకోలేక పోతున్నారన్నారు. అందుకనే చిన్న పెద్దా తేడా లేకుండా ఇష్టారాజ్యంగా వైసిపి నాయకులు మొరుగుతున్నారని పేర్కొన్నారు.అటు ప్రభుత్వాన్ని ఇటు పార్టీని సమర్థవంతంగా నడిపించగల శక్తి సామర్థ్యాలు నారా లోకేష్ సంతరించు కున్నారన్నారు.తెలుగుదేశం పార్టీ జాతీయ రాష్ట్ర కార్యవర్గాల్లో చోటు దక్కించుకున్న జిల్లా నాయకులకు ఈ సందర్భంగా గోపు సత్యనారాయణ అభినందనలు తెలిపారు.

మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ రాష్ట్ర కార్యవర్గాల్లో చోటు దక్కించుకున్న అందరికీ అభినందనలు తెలిపారు.ఈ కార్యవర్గాల్లో జిల్లాకు పెద్దపీట వేశారని ఆయన పేర్కొన్నారు.మంత్రి కొల్లు రవీంద్ర కు మరోసారి పొలిట్ బ్యూరోగా అవకాశం కల్పించడం మాజీ పార్లమెంట్ సభ్యులు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావుకు జాతీయ కోశాధికారి బాధ్యతలు అప్పగించడం మచిలీపట్నం కే గర్వకారణమన్నారు .ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కోస్తా మురళి కృష్ణ, బత్తిన దాసు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...