Skip to main content

బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే - ఆర్టీసీ చైర్మన్, మాజీ ఎంపీ, కొనకళ్ళ నారాయణరావు

మచిలీపట్నం :

  బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహ్మాత్మా జ్యోతిరావు పూలే అని, మహిళా విద్య, దళిత, బడుగు వర్గాల హక్కుల కోసం, అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలన కోసం పోరాడిన యోధుడు అని రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు కొనియాడారు. జ్యోతిరావు పూలే ద్వి శతాబ్ది జయంతి సందర్బంగా కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఆర్టీసీ చైర్మన్, మాజీ ఎంపీ, కొనకళ్ళ నారాయణరావు, తెలుగుదేశం పార్టీ కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి, గోపు సత్యనారాయణ తదితర టిడిపి నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ 1827 ఏప్రిల్ 11 పూణేలో జన్మించిన సాధారణ కుటుంబంలో జన్మించారన్నారు. చిన్ననాటి నుంచే పూలే కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారన్నారు. సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీలు అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని భావించిన వ్యక్తి అని అన్నారు. ఇతరులకు ఆదర్శంగా ఉండాలని ముందుగా తన భార్య సావిత్రిని పాఠశాలకు పంపారన్నారు. దేశంలో బాలికల కోసం మొట్టమొదటిసారిగా పాఠశాల స్థాపించారన్నారు. వితంతు పునర్వివాహాలు జరిపించి సమాజంలో చైతన్యం తీసుకొచ్చారన్నారు. మహిళా విద్య, దళిత, బడుగు వర్గాల హక్కుల కోసం, అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలన కోసం పోరాడిన యోధుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కోసం జీవితాన్ని ధారపోశారన్నారు. తన సతీమణి సావిత్రిబాయి పూలేతో కలిసి 1848లో పూణేలో బాలికల కోసం మొదటి పాఠశాలను స్థాపించారన్నారు. తుది శ్వాస విడిచి వరకూ నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడిన మహానీయుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు.
తెలుగుదేశం పార్టీ కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే స్ఫూర్తితో అన్న ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారన్నారు. బీసీలకు, మహిళలకు, అణగారిన వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన ఘనత అన్న ఎన్టీఆర్ దేనన్నారు. ఎన్టీఆర్ బాటలో నడుస్తూ, సీఎం చంద్రబాబునాయుడు బీసీలకు అన్నింటా ప్రాధాన్యమిస్తున్నారన్నారు. బీసీలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక గుర్తింపు లభించేలా ఎన్నో పథకాలు, ప్రణాళికలు అమలు చేస్తున్నారన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏపీలోనే బీసీ రక్షణ చట్టం తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇది ముమ్మాటికీ సీఎం చంద్రబాబు ఘనతేనన్నారు. బీసీల విద్యకు ప్రాధాన్యమిస్తూ బీసీ హాస్టళ్లను, గురుకులాలను వందల కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేస్తున్నారన్నారు. బీసీ కుల వృత్తులకు వెన్నుదన్నుగా సీఎం చంద్రబాబు నిలిచారన్నారు. ప్రతి బీసీ కుటుంబం నుంచి ఒకరిని వ్యాపారవేత్తగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. జ్యోతిరావు పూలే ద్విశతాబ్ధి జయంతి ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. విజయవాడలో రాష్ట్ర స్థాయి జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. తమకు, తమ పార్టీకి మహ్మాత్మా జ్యోతిరావు ఆశయ సాధనే లక్ష్యమని తెలిపారు. 
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, కొనకళ్ళ జగన్నాధరావు (బుల్లయ్య) తెలుగుదేశం పార్టీ కృష్ణాజిల్లా కార్యాలయ కార్యదర్శి, బత్తిన దాసు, బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్, పి. వి. ఫణి కుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ కృష్ణాజిల్లా ఉపాధ్యక్షుడు, మోటమర్రి వెంకట బాబా ప్రసాద్, మార్కెట్ యార్డ్ చైర్మన్, కుంచె నాని, తెలుగుదేశం పార్టీ నాయకులు, కాసాని భాగ్య రావు, బచ్చుల బోసు బాబు, గోకుల శివ, తలారి సోమశేఖర్, కోస్తా మురళీకృష్ణ, ఎండి ఇలియాస్ పాషా, పిప్పళ్ళ వెంకట కాంతారావు, బచ్చుల అనిల్ కుమార్, మాజీ కార్పొరేటర్, మరకాని సమతా కీర్తి, ఎన్ వసంతకుమారి, వేమూరి శ్రీదేవి, కట్ట అంజిబాబు, యార్లగడ్డ సీతారామయ్య, వేముల కృష్ణారావు, గండికోట అంజిబాబు, నారగాని కృష్ణ, బడుగు ఉమాదేవి, చిల్లి ముంత ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...