లాభాల బాటలో కేడీసీసీ బ్యాంక్
చాట్రాయి తోట్లవల్లూరు కాటూరు కేడీసీసీ బ్యాంకు బ్రాంచ్ లలో 100% వసూళ్లు
మచిలీపట్నం :
కృష్ణా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్(కెడిసిసి)బ్యాంక్ లిమిటెడ్ లాభాల బాటలో పయనిస్తూ రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచిందని కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం శ్రీ రఘురాం అన్నారు. గురువారం కేడీసీసీ బ్యాంకు కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు, సన్న కారు రైతుల సంక్షేమమే తమ బ్యాంకు లక్ష్యం అన్నారు.
2025- 26 సంవత్సరం బ్యాంకు అభివృద్ధిపై ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను బ్యాంకు చైర్మన్ గా కేడీసీసీ బ్యాంకుకు వచ్చి సంవత్సరం అవుతున్నట్లుగా తెలియజేశారు. బ్యాంకు సీఈఓ, సిబ్బంది బ్యాంకు అభివృద్ధిలో తనకు అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. బ్యాంకు షేర్ క్యాపిటల్ 453.94 కోట్లు, రిజర్వ్ ఫండ్ 443.95 కోట్లతో 2025-26 సంవత్సరం సొంత నిధులు మొత్తం 897.88 కోట్ల అభివృద్ధికి చేరాయని అన్నారు. అభివృద్ధి బాటలో కేడీసీసీ బ్యాంకు పని చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయిలో తాము ప్రథమ స్థానంలో నిలిచామని సగర్వంగా తెలిపారు. సొంత నిధుల గ్రోత్ గతంలో కన్నా 12.2% కి వృద్ధి చెందిందన్నారు.
మొత్తం బ్యాంకు డిపాజిట్స్ 3,850.76 కోట్లు, లోన్లు అడ్వాన్సులు 8618.63 కోట్లు తో మొత్తం బ్యాంకు వ్యాపారం 12,469.39 కోట్లకు చేరిందన్నారు. గతంలో కన్నా 7.17% వృద్ధి నమోదు తో బ్యాంకు ముందంజలో ఉండటం గర్వకారణంగా ఉందన్నారు. బారోయింగ్స్ 6646.38 కోట్లతో గతంలో కన్నా 1.54 శాతం అభివృద్ధి వైపు పయనిస్తోంద న్నారు. ఇన్వెస్ట్మెంట్లు 200863.13 కోట్లకు చేరిందని, 13. 36% అభివృద్ధిలో సాగుతోందన్నారు. తీసుకున్న వడ్డీలు 948.17 కోట్లకు చేరి 4.76% వృద్ధిలో పయనిస్తోందన్నారు.
మిస్లీనియస్ ఇన్కమ్ 19.48 కోట్లు గా ఉందన్నారు. బ్యాంక్ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెండిచర్ 91.26 కోట్లుగా ఉందన్నారు. బ్యాంక్ ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్ 52.78 కోట్లు, ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ 105.99 కోట్లకు చేరి, 4.88% వృద్ధిరేటు నమోదు చేసుకుందన్నారు.
ఉమ్మడి కృష్ణాజిల్లాలో చాట్రాయి, తోట్లవల్లూరు, కాటూరు బ్యాంకు శాఖలలో 100% వసూళ్లు సాధించడం పట్ల సిబ్బందిని అభినందించారు. రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి తిరిగి వారం రోజుల్లో మళ్ళీ వెంటనే ఋణం పొందవచ్చన్నారు. రైతులు పంట రుణమాఫీ కింద జూన్ 30 లోపు క్లైమ్ పెట్టుకోవాలని అన్నారు. రైతు సంక్షేమమే తమ బ్యాంకు లక్ష్యమని, సన్న, చిన్న కారు రైతులకు, చిరు వ్యాపారులకు తమ బ్యాంకు ఎల్లవేళలా అండదండలు అందిస్తుందని చైర్మన్ నెట్టెం శ్రీ రఘురాం అన్నారు. చనిపోయిన రైతులకు డెత్ లైన్లు సకాలంలో అందిస్తామన్నారు. అయితే సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి జీవిత బీమా కూడా అమలు చేస్తామని తెలిపారు. చిన్న, సన్నకారు రైతులు ఎవరైనా అనారోగ్య కారణాల వల్ల గాని మరే ఇతర కారణాల వల్ల గాని, వృద్ధాప్యం వల్ల గాని మరణిస్తే వారి కుటుంబానికి మట్టి ఖర్చులు నిమిత్తం పదివేల రూపాయలు దహన సంస్కారాల ఖర్చులను కూడా అందజేస్తామన్నారు.
రైతులు తమ ఇన్సూరెన్స్ పాలసీని ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకోవాలని తెలిపారు.
ఈ సందర్భంగా బ్యాంకు సంక్షేమం, అభివృద్ధి కి చిత్తశుద్ధితో పాటుపడిన ఉద్యోగులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. తమ హయాంలో కేడీసీసీ బ్యాంకును లాభాల బాటలో పయనింప చేస్తున్నామని అన్నారు. డిపాజిట్ల సేకరణలో కూడా బ్యాంకు అగ్రభాగాన నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంకు సీఈవో శ్యామ్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment