Skip to main content

పూర్తిస్థాయిలో బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలి.... జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

మచిలీపట్నం :

జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు వారి తరఫున ప్రతి పోలింగ్ కేంద్రానికి బూతు స్థాయి ఏజెంట్లను వచ్చే సమావేశంలోగా అన్ని నియోజకవర్గాలకు పూర్తిస్థాయిలో నియమించాలని జిల్లా కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి డీకే బాలాజీ ఆయా పార్టీల ప్రతినిధులకు సూచించారు.

సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నగరంలోని వారి చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించి ఎన్నికలకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1769 పోలింగ్ కేంద్రాలకు గాను తెలుగుదేశం పార్టీ1710 మందిని బూత్ స్థాయి ఏజెంట్లను నియమించిందని, ఇంకా మచిలీపట్నం గుడివాడ గన్నవరం నియోజకవర్గాల్లో కొంతమందిని నియమించాల్సి ఉందన్నారు. అలాగే వైఎస్ఆర్సిపి 1233 మంది ఏజెంట్లను నియమించిందని, గుడివాడ, పెనమలూరు నియోజకవర్గంలలో ఇంకా ఎవరిని నియమించలేదన్నారు. బిజెపి ఒక్క అవనిగడ్డలో మాత్రమే 21 మంది ఏజెంట్లను నియమించిందన్నారు. జనసేన పార్టీ అవనిగడ్డలో పూర్తిస్థాయిలో బిఎల్ఏ లను నియమించిందన్నారు.
భారత జాతీయ కాంగ్రెస్, సిపిఐ ఎం, బి ఎస్ పి పార్టీలు ఇంకా ఎవరిని ఏజెంట్లుగా నియమించలేదన్నారు. 

వచ్చే సమావేశంలోగా అన్ని రాజకీయ పార్టీలు పూర్తిస్థాయిలో బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలన్నారు. వాటి జాబితాను సంబంధిత నియోజకవర్గాల ఓటర్ల జాబితా నమోదు అధికారికి(ఈ ఆర్ ఓకు) పంపించాలన్నారు.
భారత ఎన్నికల సంఘం బూతు స్థాయి ఏజెంట్లకు త్వరలో శిక్షణ ఇవ్వనుందన్నారు.
అప్పుడే వారు బూత్ స్థాయి అధికారులతో కలిసి ఇంటింటికి తిరిగి స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీకి తోడ్పడతారన్నారు. 
బూతు స్థాయి ఏజెంట్లను నియమించకుండానే ఫిర్యాదులు తీసుకోమని స్పష్టం చేశారు. 

జిల్లాలో ఫారం 6, 7, 8 క్లెయిములకు సంబంధించి మొత్తం 86,313 దరఖాస్తులు అందగా అందులో 84,354 పరిష్కరించడం జరిగిందని, మిగిలిన 1959 దరఖాస్తులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయన్నారు.

జిల్లాలో 2002 ఓటర్ల జాబితాను 2025 ఓటర్ల జాబితాతో ప్రత్యేక తీవ్రతర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్)మ్యాపింగ్ 69 శాతంబిపూర్తి చేశామన్నారు. 

ఈ సమావేశంలో డిఆర్ఓ చంద్రశేఖర రావు, టిడిపి, ఐ ఎన్సి, బిజెపి, సిపిఎం, బి ఎస్ పి, వైఎస్ఆర్సిపి పార్టీల ప్రతినిధులు దాస్, మతిన్ ఖాన్, పివీ గజేంద్ర రావు, కొడాలి శర్మ.. రాజేష్, బాలాజీ...ఉపేంద్రనాథ్, సిలార్ దాదా...బాషా, కలెక్టరేట్ ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...