Skip to main content

పుస్తకాలను చదవడం ఆసక్తి గా మార్చుకోవాలి- కెయూ ఉపకులపతి ఆచార్య కె. రాంజీ


యూనివర్సిటీ లో ప్రపంచ పుస్తక దినోత్సవ వేడుకలు 

మచిలీపట్నం :

 విద్యార్ధులు పుస్తక పఠనం ను ఆసక్తిగా ఎంచుకోవాలని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె. రాంజీ పేర్కొన్నారు. గురువారం విశ్వవిద్యాలయ సెంట్రల్ లైబ్రరీ లో నిర్వహించిన ప్రపంచ పుస్తక దినోత్సవ వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ రోజు ప్రముఖులుగా ఆరాధించబడుతున్న ప్రతి ఒక్కరూ పుస్తకాలను ఆసక్తి గా చదవడం వల్ల ఆ స్థాయికి చేరుకున్నారని వివరించారు. సాంకేతికత పెరిగి ఫోన్లు, కంప్యూటర్లు తో కాలక్షేపం చేస్తున్నా పుస్తక పఠనం ను కూడా దిన చర్యలో భాగంగా మలచుకోవడం అవసరమన్నారు. తద్వారా ఒత్తిడి తగ్గించుకోవడం సాధ్యమవుతుందన్నారు.
 రిజిస్ట్రార్ ఆచార్య ఎన్. ఉష మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో భాషా పరిజ్ఞానం చాలా అవసరమని, అది పుస్తక పఠనం ద్వారానే పెంచుకోగలమన్నారు. తెలుగు తో పాటు ఆంగ్లం, హిందీ భాషల్లో ప్రావీణ్యం సంపాదించుకుంటే ఉత్తర భారతదేశం తో పాటు విదేశాల్లో కూడా ఉపాధి అవకాశాలు పొందవచ్చన్నారు.
డా. ఏపిజే. అబ్దుల్ కలాం సెంట్రల్ లైబ్రరీ సమన్వయకర్త డాక్టర్ ఎం. శ్రావణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ డిప్యూటీ లైబ్రేరియన్ రమణ, కృష్ణా విశ్వవిద్యాలయం విశ్రాంత తెలుగు సహాయ ఆచార్యులు వరుణకుమారి లు గ్రంథాలయాల ఆవశ్యకత, పుస్తక పఠనం పై ప్రసంగించారు. ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాల ల విద్యార్థులు తో పాటు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్ధులు ప్రపంచ పుస్తక దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని తమదైన శైలిలో ప్రసంగించారు. అనంతరం అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తాళపత్ర గ్రంథాలు, భారత రాజ్యాంగం తో పాటు అరుదైన, విలువైన పుస్తకాల తో ఏర్పాటు చేసిన ప్రదర్శన ను విద్యార్ధులు ఆసక్తిగా తిలకించారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...