Skip to main content

బందరు లో చంద్రబాబు జన్మదిన వేడుకలు

మచిలీపట్నం :

మచిలీపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. బచ్చుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలతో కార్యక్రమాలు ప్రారంభమై, అనంతరం నియోజకవర్గ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పాలాభిషేకం, కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా జరిగిన సభలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్, సీనియర్ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ, టౌన్ పార్టీ అధ్యక్షుడు లోగిశెట్టి స్వామి, మాజీ మున్సిపల్ చైర్మన్ మొటమర్రి బాబా ప్రసాద్, సీనియర్ నాయకులు పల్లపాటి సుబ్రహ్మణ్యం, మాజీ కార్పొరేటర్ దేవరపల్లి అనిత, మహిళా నాయకురాలు లంకిశెట్టి నీరజ తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో చంద్రబాబు నాయుడు కి నాయకులు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తెలుగువారి ఆత్మగౌరవాన్ని జాతీయ స్థాయిలో చాటిన మహానేత అని పేర్కొన్నారు. పరిపాలనలో పారదర్శకత, అభివృద్ధిలో దూరదృష్టి, ప్రజాసేవలో నిబద్ధత కలిగిన నాయకుడిగా ఆయన దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందారని చెప్పారు. రాష్ట్రాన్ని సాంకేతిక రంగంలో ముందంజలో నిలబెట్టి, అభివృద్ధి పథంలో నడిపించిన విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారేనని కొనియాడారు. రైతు సంక్షేమం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు, పారిశ్రామికాభివృద్ధి, రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, పట్టణాభివృద్ధి వంటి అనేక రంగాల్లో ఆయన కృషి అపారమని వివరించారు. ప్రజల మన్ననలు పొందిన చంద్రబాబు నాయుడు గారికి ఆయురారోగ్యాలు కలగాలని, దీర్ఘాయుష్షుతో ప్రజాసేవ కొనసాగించాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అంతకుముందు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కోనేరు సెంటర్‌లో ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం అన్నా క్యాంటీన్‌లో ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించగా, ప్రభుత్వ వృద్ధాశ్రమంలో వృద్ధులకు బన్నులు పంపిణీ చేశారు. అలాగే ఖలేగాన్‌పేట ప్రాంతంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ వేడుకల్లో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వార్డు ఇన్‌చార్జులు, క్లస్టర్ ఇన్‌చార్జులు, మైనార్టీ నాయకులు తదితరులు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...