Skip to main content

కృష్ణా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ లో ఉత్తమ ఫలితాలు సాధించిన ఇంటర్మీడియట్ విద్యార్థులు


మచిలీపట్నం :

కృష్ణాజిల్లాలో ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల వసతి గృహాల విద్యార్థులు ఇంటర్మీడియట్ – 2026 ఫలితాలలో అద్భుత విజయాలు సాధించారు. జూనియర్ ఇంటర్మీడియట్  ఫలితాలలో జిల్లావ్యాప్తంగా మొత్తం విద్యార్థులు 133 మంది హాజరయ్యారు. వీరిలో 116 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 87% గా నమోదు చేసుకున్నారు. 
జూనియర్ ఇంటర్ లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు   
ఎంపీసీ విభాగంలో చాముండేశ్వరి కుసుమ – 460/470 మార్కులు (ఎస్సీ బాలికల వసతి గృహం, అవనిగడ్డ) 
ఏ ఎన్ పి విభాగంలో  ఎస్. మిరియం – 480/500 మార్కులు (ఎస్సీ బాలికల వసతి గృహం, మచిలీపట్నం) ఎం.ఎల్.టి విభాగం బి. వర్షిని – 474/500 మార్కులు (ఎస్సీ బాలికల వసతి గృహం, మచిలీపట్నం)
ఫస్ట్ ఇయర్‌లో 20 మంది విద్యార్థులు 400కు పైగా మార్కులు సాధించి విశిష్ట ప్రతిభ కనబరిచారు. 
సీనియర్ ఇంటర్మీడియట్ లో  మొత్తం  విద్యార్థులు 111 మంది హాజరవ్వగా వీరిలో 100 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 90% గా నమోదు చేసుకున్నారు. 
ద్వితీయ సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల వివరాలు 
ఎం పి హెచ్ డబ్ల్యు: ఎల్. షైనీ – 963/1000 మార్కులు (ఎస్సీ బాలికల వసతి గృహం, గుడివాడ)
ఎం ఎల్ టి  విభాగంలో బి ఈశ్వరి నాగజ్యోతి – 962/1000 మార్కులు (ఎస్సీ బాలికల వసతి గృహం, మచిలీపట్నం)
ఎం ఎల్ టి లో చంద్రిక – 958/1000 మార్కులు (ఎస్సీ బాలికల వసతి గృహం, గుడివాడ).

సెకండ్ ఇయర్‌లో 25 మంది విద్యార్థులు 900కు పైగా మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనపరిచినట్లు సాంఘిక సంక్షేమ శాఖ అధికారి తెలిపారు. ఈ అద్భుత ఫలితాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎస్సీ సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల వసతి గృహాల్లో అమలు చేస్తున్న నాణ్యమైన బోధన, ప్రత్యేక శిక్షణ అధ్యాపకుల అంకితభావానికి నిదర్శనం అని , ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎస్.కె షాహిద్ బాబు విద్యార్థులను, ఉపాధ్యాయులను, హాస్టల్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...