Skip to main content

ఘనంగా మాజీమంత్రి నడకుదుటి నరసింహారావు పంచమ వర్ధంతి

- జీవితాంతం ప్రజలకు ఏదో ఒకటి చేయాలని తపించారు
- మత్స్యకార పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్స్ ఆయన ఘనతే
- మచిలీపట్నం అభివృద్ధికి గుర్తుగా హార్బర్‌కు నరసింహరావు పేరు హర్షణీయం
- టీడీపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన నరసింహరావు వర్ధంతి కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం : 

సామాన్య కుటుంబం నుండి వచ్చినప్పటికీ పేదల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించిన నాయకుడు నడకుదిటి నరసింహరావు అని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద నిర్వహించిన నరసింహరావు వర్ధంతి కార్యక్రమంలో అంజలి ఘటించారు. ఎన్నో అవమానాలు, ఒడిదొడుకులు ఎదుర్కొని నిత్యం శ్రమించి ఎదిగారు. అర్బన్ బ్యాంకు ఛైర్మన్ స్థాయిలో నరసింహరావు  చేసిన నిస్వార్ధ సేవలను గుర్తించి ఎమ్మెల్యేగా సీటు ఇచ్చి మంత్రిగా చేశారు. మంత్రిగా బాద్యతలు స్వీకరించిన రోజు నుండి మత్స్యకారుల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించారన్నారు. మత్స్యకార పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్స్, బీసీ రెసిడెన్సియల్ హాస్టల్స్ ఆయన ఘనతే అన్నారు .మత్స్యకారుల పడవలకు డీజిల్ సబ్సిడీ నరసింహరావు పోరాట ఫలితమన్నారు. అదే సమయంలో వేటకు వెళ్లే పడవలకు శాటిలైట్ అనుసంధానం చేయాలని ప్రతిపాదించారు.

నియోజకవర్గంలో సీసీ రోడ్లు, భారత్ సాల్ట్ పరిశ్రమ, ఇళ్ల స్థలాలు కేటాయించి అభివృద్ధికి తోడుగా నిలిచారు. అదే సమయంలో డ్రైవర్స్ కాలనీ, రుద్రవరంలో అనేక కాలనీలు నిర్మించిన ఘనత నరసింహరావుదే అన్నారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా మచిలీపట్నం హార్బర్‌కు నరసింహరావు పేరు పెట్టడం గర్వంగా ఉందన్నారు.వీలైనంత త్వరగా హార్బర్ పనులు పూర్తి చేసి అక్కడ నరసింహరావు భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటామన్నా రు.

నరసింహరావు స్పూర్తితోనే నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నాం. ఫిషింగ్ హార్బర్, బందరు పోర్టు వీలైనంత త్వరగా పూర్తి చేస్తాం. నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు స్థానికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. తీర ప్రాంతంలో జాతీయ రహదారి నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు పంపించామన్నారు. మచిలీపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలిపి నరసింహరావు ఆశయాలను సాకారం చేసి చూపిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.  

అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర సతీమణి కొల్లు నీలిమ మాట్లాడుతూ మనం సంపాదించిన ప్రతి రూపాయిలో కొంత ప్రజల కోసం కేటాయించాలని నాన్న నేర్పించారు. ఆయన స్పూర్తితోనే అనేక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు.  అందరికీ గౌరవం కలిగేలా అభివృద్ధి పనులు చేయాలనే లక్ష్యంతో నిరంతరం పని చేస్తున్నామన్నారు.మన నాయకుడు చంద్రబాబు నాయుడు తో ఉంటున్నందుకు మనమంతా గర్వపడాలన్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారంతా కూడా సీనియర్లతో కలిసి పని చేసినపుడే విజయం సాధించగలం అన్నారు.

ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, వర్ల కుమార్ రాజా, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు గారు, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గోపు సత్యన్నారాయణ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...