Skip to main content

స్వచ్ఛ సైనికులు ముందుకు రావాలి.... జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

మచిలీపట్నం :

చెత్తరహిత స్వచ్ఛ మచిలీపట్నం నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ స్వచ్ఛ సైనికులుగా ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి డీకే బాలాజీ పిలుపునిచ్చారు.

ఆదివారం ఉదయం తెల్లవారుజామునే జిల్లా కలెక్టర్ వినూత్నంగా స్వచ్ఛత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నూతనంగా రూపొందించిన స్వచ్ఛ ఆయుధం చేతబూని నగరంలోని 16వ డివిజన్ రామానాయుడు పేటలో ఐదు రోడ్ల సెంటర్ వరకు స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో భాగంగా చెత్తాచెదారాలను, ప్లాస్టిక్ కవర్లను ఏరివేశారు. వారికి తోడుగా ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు వసుధ జీవవైవిద్య బృందం మణిరత్నం నాయకత్వంలో వాలంటీర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి స్వచ్ఛ ఆయుధంతో చెత్త ఏరివేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. 
ఆ ప్రాంతంలో కలెక్టర్ పర్యటిస్తూ రహదారి పైన గాని, ఇరువైపులా గాని చెత్తాచెదారాలు ఎక్కడపడితే అక్కడ వేయరాదని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అక్కడి ప్రజలకు సూచించారు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మచిలీపట్నం నగరాన్ని స్వచ్ఛ మచిలీపట్నం గా తీర్చిదిద్దాలని సంకల్పించామన్నారు. 
ఈ దిశలో ప్రధానంగా పరిశీలిస్తే చెత్త ఎక్కడబడితే అక్కడ ఉంటున్నట్లు గమనించడం జరిగిందన్నారు 
అది ఉండకుండా చేయాలంటే రోజు పారిశుధ్య సిబ్బంది ఇంటింటికి తిరిగి చెత్త తొలగించి, మురికి కాలువలో పూడిక తీయాలంటే ఇబ్బంది కలుగుతుందన్నారు.

ఈ పరిస్థితులను అధిగమించేందుకు కొందరు స్వచ్ఛంద కార్యకర్తలను చైతన్యపరిచి వాళ్ళ ప్రాంతాల్లో స్వచ్ఛ ఆయుధం ద్వారా చెత్తాచెదారాలను ఏరివేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.

ఈ కార్యక్రమానికి స్వచ్ఛ సైనికులు అని పేరు పెట్టామన్నారు. ఆ ప్రకారంగా నేడు రామానాయుడు పేటలో నివసించే వారితో కలిసి స్వచ్ఛ ఆయుధంతో చెత్తను ఎరివేసే కార్యక్రమం చేపట్టామన్నారు గతంలో చేతులతో చెత్తను తీసేటప్పుడు వంగి తీయడం వలన చాలా సమస్య ఏర్పడేదని, ప్రస్తుతం మనిషి నిలుచునే ఎక్కువ చెత్తను సులభంగా ఏరివేసేందుకు పట్టకార లాగా ఉండే ఈ స్వచ్ఛ ఆయుధం ఎంతగానో బాగుందన్నారు.

నగరంలోని ప్రజలు స్వచ్ఛ సైనికులుగా తరలివచ్చి ప్రతిరోజు ఉదయమే ఒక అర్థగంట కేటాయించి చెత్తను ఎరివేస్తే వారు నివసించే చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవచ్చన్నారు.
మొదట్లో చెత్త కొంత ఎక్కువగా ఉన్న ఆ తర్వాత ఏ రోజు చెత్త ఆరోజు తీసివేయడం వలన పెద్దగా పని ఉండదన్నారు.
ఆ ప్రకారం గా పారిశుద్ధ్య కార్మికులతో ప్రజలందరూ పాల్గొని చెత్త రహిత మచిలీపట్నం గా తీర్చిదిద్దేందుకు ముందుకు రావాలన్నారు 
స్వచ్ఛ సైనికులను గుర్తించే కార్యక్రమాన్ని చేపట్టామని ఇందులో ప్రజలందరూ తమ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకునే దిశగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.
ఆ క్రమంలో వసుధ జీవవైవిద్య బృందం కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. వారు తనతో కలిసి రామానాయుడు పేటలో రహదారి మొత్తం పరిశుభ్రం చేయడం జరిగిందన్నారు. 
వాళ్లు వారి నివసించే ప్రాంతాన్ని దత్తత తీసుకొని ఇకపై ప్రతిరోజు ఉదయమే వారి ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుతామని ముందుకు వచ్చారన్నారు. 
ఇదేవిధంగా ప్రజలందరూ వారు నివసించే ప్రాంతాలను దత్తత తీసుకొని అక్కడ ప్రతిరోజు ఉదయం ఒక అరగంట వారి ప్రాంతాన్ని పరిశుభ్రం చేయాలన్నారు.

ఉదయాన్నే పని చేయడం వలన అందరికీ కొంత వ్యాయామం చేయడంతో పాటు సూర్యకిరణాలు తగిలి విటమిన్ డి ఉచితంగా లభించి ఆరోగ్యంగా ఉంటామన్నారు. 

మనం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మనం నివసించే మచిలీపట్నం నగరం కూడా ఆరోగ్యంగా ఉంచుకునే అవకాశం వచ్చిందన్నారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట మునిసిపల్ సహాయ కమిషనర్ గోపాలరావు, వసుధ జీవవైవేద్య బృందం నాయకులు మణిరత్నం, వారి కార్యకర్తలు, మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది, స్వచ్ఛ సర్వేక్షన్, స్వర్ణ వార్డు సిబ్బంది పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...