Skip to main content

మహిళా సాధికారతకు జిల్లా పరిషత్ కొత్త దిశ

జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ కుమార్ తో కలిసి నూతన షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక

మచిలీపట్నం: 

మహిళల స్వయం ఉపాధి, ఆర్థిక సాధికారత లక్ష్యంగా కృష్ణా జిల్లా పరిషత్ నూతన షాపింగ్ కాంప్లెక్స్‌ ద్వారా మహిళలకు వ్యాపారావకాశాలతో పాటు జిల్లా పరిషత్‌కు ఆదాయ వనరు కలగనుందని జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక పేర్కొన్నారు.
గురువారం ఉదయం కృష్ణా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మచిలీపట్నం నగరంలోని జిల్లా పరిషత్ ముంగిట నూతనంగా నిర్మించిన దుకాణాల సముదాయాన్ని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ కుమార్ తో కలిసి ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ మాట్లాడుతూ, మహిళా సాధికారతను దృష్టిలో ఉంచుకుని సుమారు రెండేళ్ల క్రితం ఈ భవనానికి మహిళా సాధికారత భవనంగా శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. మహిళలు చిన్న స్థాయి వ్యాపారాల ద్వారా ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో ఈ దుకాణాలను వారికి కేటాయించేలా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

మచిలీపట్నంలో 10 దుకాణాలు, అవనిగడ్డలో 12 దుకాణాలు మహిళల అభివృద్ధి, స్వయం ఉపాధి ప్రోత్సాహం కోసం సిద్ధం చేయబడ్డాయని, వీటి ద్వారా మహిళలు చిన్న వ్యాపారాలు ప్రారంభించి కుటుంబ ఆర్థికాభివృద్ధికి తోడ్పడటంతో పాటు, సమాజంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగగలరని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

దుకాణాల కేటాయింపు ప్రక్రియను పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తామని చైర్‌పర్సన్ స్పష్టం చేశారు. త్వరలోనే పత్రికా ప్రకటన విడుదల చేసి, ఓపెన్ టెండర్ విధానం ద్వారా అర్హులైన వారికి దుకాణాలను కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఈ షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా ఒకవైపు మహిళలకు స్థిరమైన ఉపాధి అవకాశాలు లభించగా, మరోవైపు జిల్లా పరిషత్‌కు అదనపు ఆదాయం సమకూరుతుందని ఆమె తెలిపారు. ఈ ప్రాజెక్టు సామాజిక, ఆర్థిక పరంగా ఎంతో ప్రయోజనకరంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు సాకారం కావడానికి కృషి చేసిన జిల్లా పరిషత్ సీఈఓ, డిప్యూటీ సీఈఓ, ఇంజినీరింగ్ విభాగం అధికారులు, సిబ్బంది సంబంధిత శాఖలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

కార్యక్రమంలో జెడ్పీ సీఈవో డాక్టర్ జే అరుణ, డిప్యూటీ సీఈవో డాక్టర్ ఆనంద్ కుమార్, పంచాయతీ రాజ్ ఎస్ఈ రమణరావు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...