Skip to main content

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

 మచిలీపట్నం :

 మచిలీపట్నం భారతీయజనతా పార్టీ కార్యాలయంలో పండగ వాతావరణం లో జరిగిన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో తొలుత అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు, వక్తలు మాట్లాడుతూ 1980 సంవత్సరం ఏప్రిల్ 6 తేదీ నాడు ముంబై నగరం బాంద్రా ఏరియాలో 80 వేలమంది కార్యకర్తల సమక్షంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం చాలా ఘనంగా జరిగి, అటల్ బిహారీ వాజపేయి ని ప్రధమ అధ్యక్షులు గా ఎన్నుకున్నారు.
ఆనాటి నుండి ఈనాటి వరకు వాజ్ పాయ్ , లాల్ కృష్ణ అద్వానీ తదితర నాయకుల నాయకత్వంలో గ్రామీణ స్థాయి వరకు భారతీయ జనతా పార్టీ ఎంతో అభివృద్ధి చెంది వాజ్ పాయ్ మొదటి ప్రధాని గా అంత్యోదయ, స్వర్ణ చతుర్భుజి, రోడ్ , సాగర్, ఎయిర్ కనెక్ట్ వీలతో సుపరిపాలన అందించారన్నారు.
గత పుష్కర కాలంగా ప్రధాని నరేంద్ర మోడీ భారత్ దేశాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తూ ప్రపంచ పటంలో అతి పెద్ద పార్టీగా దేశ రక్షణ, మేకిన్ ఇండియా , అవినీతి రహిత సుపరిపాలన తో  ప్రపంచం లోనే 3వ ఆర్థిక శక్తిగా అగ్రభాగాన నిలిపారని, ఇది మనందరికీ గర్వకారణం అని పేర్కొన్నారు.
 ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తాతినేని శ్రీ రామ్, నాయకులు రామినేని వెంకటకృష్ణ, కూనపరెడ్డి శ్రీనివాస్, వల్లూరి శ్రీమన్నారాయణ, పంతం గజేంద్ర, చలంచర్ల పద్మరాజు, జిల్లా నాయకులు వల్లూరిపల్లి రమణ, పోలన అశోక్, పుప్పాల రాము, పామర్తి రామకృష్ణ, తుంగల గిరి, గంటా సతీష్, వీరమల్లు అభినందన, సలాది రామకృష్ణ, సూరి శెట్టి హరికృష్ణ, ధూళిపాళ శ్రీ రామచంద్ర మూర్తి , వివిధ మోర్చల జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు తదితర మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...