Skip to main content

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ పీజీ సెంటర్‌లో "డిప్లమా ఇన్ హాస్పిటాలిటీ & హాస్పిటల్ మేనేజ్‌మెంట్” కోర్సు ప్రారంభం

విజయవాడ :

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ పీజీ సెంటర్‌లో "డిప్లమా ఇన్ హాస్పిటాలిటీ & హాస్పిటల్ మేనేజ్‌మెంట్” కోర్సును గురువారం అధికారికంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి కృష్ణా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కూనన్ రాంజీ  అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రెక్టర్ ప్రొఫెసర్ ఎం.వి. బసవేశ్వర్ రావు, ప్రొఫెసర్ ఉజ్వల్ గటక్ (రాయలసీమ ఫిజియోథెరపీ సెంటర్), ప్రొఫెసర్ సుజిత్ కుమార్ (నేవీ కమాండో),  ఎన్టీఆర్ పీజీ సెంటర్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ దిలీప్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
 వైస్ ఛాన్స్లర్  రాంజీ  మాట్లాడుతూ, 2026–27 విద్యా సంవత్సరంనుంచి సమాజానికి అత్యవసరమైన పలు కొత్త కోర్సులను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

డిప్లమా కోర్సులు:
హాస్పిటల్ మేనేజ్‌మెంట్,ఫార్మసీ,
అడల్ట్ & కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్,
యోగా ఇన్‌స్ట్రక్టర్ & కౌన్సెలింగ్, మ్యూజిక్, ఏఐ & రోబోటిక్స, లైబ్రరీ సైన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెరైన్ ఎలక్ట్రానిక్స్, సైబర్ క్రైమ్

పీజీ డిప్లమా కోర్సులు:
అగ్రిబిజినెస్ మేనేజ్‌మెంట్,
బయోటెక్నాలజీ ఎంట్రప్రెన్యూర్షిప్
ఈ కోర్సుల ద్వారా విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర సైనిక్ బోర్డ్, కేంద్రీయ సైనిక్ బోర్డ్‌లతో భాగస్వామ్యం చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు ప్రొఫెసర్ దిలీప్  తెలిపారు.

విజయవాడ పరిసర ప్రాంతాల ప్రజలకు ఈ కోర్సులు అందుబాటులో ఉంటాయి. తరగతులు ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 9:00 గంటల వరకు నిర్వహించబడతాయి. ప్రతిరోజు 3 గంటలపాటు క్లాసులు ఉంటాయి.

డిప్లమా కోర్సుల వ్యవధి: 3 నెలలు

పీజీ డిప్లమా కోర్సుల వ్యవధి: 6 నెలలు

అర్హులైన అభ్యర్థులు వెంటనే అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...