Skip to main content

స్థానిక 22వ డివిజన్ ప్రజాదర్శినిలో ప్రజలతో ముఖాముఖి నిర్వహించిన మంత్రి కొల్లు రవీంద్ర

అందరికీ సంక్షేమం అదే కూటమి లక్ష్యం

మచిలీపట్నం:

ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందాలనేది కూటమి ప్రభుత్వ సంకల్పం 
దీనిపై ఏరియా వారిగా కూటమి నాయకులు బాధ్యత తీసుకోవాలి 
దేశంలోనే అతి తక్కువ తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 
సంక్షేమం, అభివృద్ధి విషయంలో ముందంజలో

స్థానిక 22వ డివిజన్ ప్రజాదర్శినిలో మంత్రి కొల్లు రవీంద్ర ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు.  మంత్రి రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామన్నారు. తల్లికి వందనం ,గ్యాస్ సిలిండర్ల పంపిణీ, ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ తదితర సంక్షేమ పథకాలు ద్వారా ప్రజలకు ఎంతో మంచి చేస్తున్నామన్నారు.

పూర్తయిన జి ప్లస్ త్రీ ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులకు అందజేశామన్నారు. ఉపాధికి ఊతమిచ్చే విధంగా కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు.కేంద్ర రాష్ట్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధిని అటకెక్కించారు అక్రమ కేసులు అరాచకాలతో పాలన చేశారన్నారు. నా పైన ఎన్నో అక్రమ కేసులు పెట్టారు.తాను ఏ తప్పు చేయలేదు కాబట్టే , ఏ కేసుకి భయపడలేదన్నారు.

అడుగడుగునా ఇబ్బంది పెట్టడం అభివృద్ధికి అడ్డం పడడమే వైసీపీ నాయకుల దినచర్య, అమరావతికి జగన్ బందరుకు స్థానిక వైసీపీ నాయకులు ఆటంకంగా మారారని అయినా, మేమంతా సమిష్టిగా కూటమిలా ముందుకు వెళ్తున్నామన్నారు. ఇప్పుడు కొత్తగా మావిగన్ అనే కొత్త నాటకానికి తెర తీశారన్నారు.

అది గన్నో, బన్నో జనానికి అర్థం కావడం లేదని మంత్రి అన్నారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేసే విధంగా కూటమి పాలన జరుగుతుందన్నారు. దానిని అడ్డుకునే ప్రయత్నం వైసీపీ చేస్తుంది అందుకు ఆస్కారం లేకుండా రాష్ట్రంలో సుస్థిర పాలన కొనసాగాలి. రాష్ట్రంలో కూటమి పాలన సుదీర్ఘ కాలం కొనసాగితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంబరాన్ని అంటుతుందనడంలో సందేహం లేదన్నారు. కూటమి ఎప్పటికీ కలిసే ఉంటుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోను కూటమి ఘన విజయం సాధించాలన్నారు. 

ప్రజల మద్దతు కూటమి ప్రభుత్వానికి ఉండాలని, మీ ఆశీర్వాద బలమే మాకు శ్రీరామరక్ష అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...