Skip to main content

ఎక్సైజ్ వ్యవస్థను పారదర్శకతకు కేంద్రంగా మార్చాం



- జగన్ తన దోపిడీ కోసం ఎక్సైజ్ శాఖను భ్రష్టు పట్టించారు
- సొంత బ్రాండ్లను ప్రజల నెత్తిన రుద్ది జేబులు నింపుకున్నారు
- మద్యం షాపులు, బార్లు కేటాయింపుతో ప్రభుత్వానికి రూ.1800 కోట్ల ఆదాయం
- అసెంబ్లీలో ఎక్సైజ్ శాఖపై చర్చ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర.

మచిలీపట్నం :

        కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్సైజ్ శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంతో పాటుగా, పారదర్శకతకు కేంద్రంగా మార్చామని అసెంబ్లీలో ఎక్సైజ్ శాఖపై చర్చ సందర్భంగా రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని జగన్  దోపిడీకి వాడుకున్నాడని ధ్వజమెత్తారు. జగన్  అధికారంలోకి రాగానే మద్యం వ్యాపారం మొత్తాన్ని చెప్పు చేతల్లో పెట్టుకున్నారు. ఎక్సైజ్ శాఖను విడగొట్టి సెబ్ పేరుతో విడగొట్టాడు. నాసిరకమైన, కల్తీ మద్యం బ్రాండ్లను తీసుకొచ్చి ప్రజల నెత్తిన బలవంతంగా రుద్దాడు. ధరలు పెంచడం, నాణ్యమైన మద్యం అందుబాటులో లేకపోవడంతో సరిహద్దుల్లో అక్రమ రవాణా తీవ్రతరమైంది. బీర్ అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి. డ్రగ్స్, గంజాయి, నాటు సారా అమ్మకాలను వైసీపీ నేతలే దగ్గరుండి చేశారు. ఐఏఎస్ అధికారిని నియమించాల్సిన చోట అర్హత లేని వ్యక్తిని తీసుకొచ్చి అందలమెక్కించారు. ఐదేళ్లలో సుమారు రూ.98 వేల కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే డిజిటల్ పేమెంట్లు 0.6 శాతం మాత్రమే. ఆటోమేటెడ్ ఆర్డర్స్ విధానాన్ని రద్దు చేసి మేన్యువల్ విధానంతో తమ బ్రాండ్లకు ఆయాచిత లబ్ది చేకూరేలా చేశారు.

 కూటమి అధికారంలోకి రాగానే గత ప్రభుత్వంలో జరిగిన మద్యం అక్రమాలపై సిట్ ఏర్పాటు చేసింది. గత ఐదేళ్లలో సుమారు రూ.3200 కోట్ల స్కాం జరిగినట్లు నిరూపించాం. మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసి మద్యం విధానాన్ని రూపొందించాం. నూతన మద్యం పాలసీ ప్రకటనతో సుమారు 89 వేల దరఖాస్తులు రాగా రూ.1800 కోట్ల ఆదాయం వచ్చింది. గీత కులాలకు 10 శాతం మద్యం షాపులు కేటాయించాం. లైసెన్సు ఫీజులో 50 సబ్సిడీ ఇచ్చాం. దేశ వ్యాప్తంగా అందుబాటులో ఉండే అన్ని బ్రాండ్లను అందుబాటులో ఉంచాం. ఫలితంగా పొరుగు రాష్ట్రాల నుండి అక్రమ రవాణా నిలిచిపోవడంతో పాటుగా.. ఏపీలోని మద్యం బ్రాండ్లు, ధరల కారణంగా సరిహద్దు జిల్లాల్లో అమ్మకాలు పెరిగాయి. 

 ఎక్సైజ్ శాఖ ప్రక్షాళనలో భాగంగా ట్రాక్ అండ్ ట్రేస్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చాం. డిస్టిలరీ నుండి వచ్చే ప్రతి మద్యం బాటిల్‌ను ట్రాక్ చేశాం. ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా ప్రజలకు కూడా మద్యం గురించిన వివరాలు తెలుసుకునే వెసులుబాటు కల్పించాం. ప్రతి బ్యాచ్ మద్యాన్ని 9 రకాలుగా పరీక్షించిన తర్వాతనే మార్కెట్లో అందుబాటులోకి తీసుకొస్తున్నాం. నవోదయం 2.0 ప్రారంభించి రాష్ట్రంలో నాటు సారాను పూర్తిగా నిర్మూలించాం. ఈగిల్ టీమ్స్ ద్వారా గంజాయిని నిర్మూలించాం. గత ఐదు సంవత్సరాల పాటు మద్యం డిజిటల్ పేమెంట్స్ కేవలం 0.6 శాతం ఉండగా.. ప్రస్తుతం 40 శాతానికి పెంచాం. 

 రాష్ట్రంలో జరుగుతున్న పారదర్శకమైన పాలనపై బురద జల్లడమే లక్ష్యంగా వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారు. అందుకు మొలకలచెరువు, ఇబ్రహీంపట్నం ఘటనలు నిదర్శనం. ప్రభుత్వంపై నిందమోపేందుకు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేలా కల్తీ మద్యం తయారు చేశారు. ఈ దుర్మార్గంలో మాజీ మంత్రులు భాగస్వాములుగా ఉండడం అత్యంత జుగుప్సాకరం. రాష్ట్రంలో ఎక్సైజ్ వ్యవస్థను అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నాం. పొరుగు రాష్ట్రాల నుండి ఎక్సైజ్ అధికారులు వచ్చి ఇక్కడి మద్యం పాలసీని అద్యయనం చేయడం అందుకు నిదర్శనం. మద్యం అక్రమాలకు పాల్పడి.. కూటమి ప్రభుత్వంపై నిందలేస్తామని ప్రయత్నిస్తే సహించేది లేదని, ఎంతటి వారున్నా అందరిపైనా చర్యలు తప్పకుండా తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

 అనంతరం స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ.. మద్యం కుంభకోణం రూ.3200 కోట్లుగా ప్రభుత్వం ప్రకటించిందని, కానీ వాస్తవంలో రూ.10 వేల కోట్లకు పైగా ఉండే అవకాశం లేకపోలేదని, విచారణను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...