Skip to main content

మునిసిపల్ సూపర్ స్ట్రక్చర్ పన్ను దేనికైనా వర్తిస్తుంది..... జిల్లా కలెక్టర్



మచిలీపట్నం :

వచ్చే మే నెల ఒకటో తేదీ నుండి చేపట్టనున్న ఇండ్ల గణన కార్యక్రమాన్ని ఎలాంటి తప్పులు దొరలకుండా సజావుగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గణన చార్జ్ అధికారులను ఆదేశించారు. 

బుధవారం జిల్లా కలెక్టర్ కృష్ణా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన మొదటి దశ ఇండ్ల జాబితా, ఇండ్ల గణన జిల్లా చార్జ్ స్థాయి అధికారుల శిక్షణా తరగతుల్లో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల మాదిరిగా ఈ ఇండ్ల గణన కార్యక్రమాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణించి శ్రద్ధతో చేయాలన్నారు. ఈ గణన కార్యక్రమంలో సరైన వివరాలు నమోదు చేయడం అందరి బాధ్యత అన్నారు.
కొందరు ఇంటి యజమానులు కింది అంతస్తు నిర్మించుకున్న తర్వాత మొదటి అంతస్తు కొత్తగా నిర్మించుకుంటారని వాటికి నంబరు తీసుకోకుండా ఉంటారని చెప్పారు. అలాగే కొన్నిసార్లు అసైన్మెంట్, ప్రభుత్వ భూములకు ఇంటి స్థలాలుగా ఇచ్చి ఉన్న వాటికి నంబరు ఇవ్వవచ్చా లేదా అనే చాలామంది మీమాంసలో కూడా పడతారన్నారు. 

వాస్తవంగా మున్సిపల్ చట్టం ప్రకారం సూపర్ స్ట్రక్చర్ పన్ను దేనికైనా వేయవచ్చన్నారు. ప్రతి ఇంటి పన్ను చెల్లింపుదారునికి నంబర్ తప్పనిసరిగా ఎన్యుమరేటరు ఇవ్వడం చాలా ముఖ్యమన్నారు.

ప్రతి ఒక్కరూ ఇండ్ల జాబితా గణన ఎలా చేయాలో పూర్తిగా అర్థం చేసుకోవాలన్నారు. అప్పుడే వారు ఎన్యూమరేటర్లకు సరైన శిక్షణ ఇవ్వగలుగుతారన్నారు. 

ఎన్యూమరేటర్లను నియామకంపై త్వరలో స్పష్టత వస్తుందని ఆ తదుపరి వారిని నియమించుకుని వారికి కూడా శిక్షణా తరగతులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ప్రతి ఎన్యూమరేటరు వారికి ఇచ్చిన ఇండ్ల జాబితా బ్లాక్ లో ఏ ఏ ఇండ్లు ఉన్నాయో సరి చూసుకోవాలన్నారు 

వారికి ఒక ఎక్సెల్ షీట్ అందజేసి వారి పరిధిలో ఉన్న 700 నుంచి 800 ఇండ్లకు సంబంధించి నంబర్లు జాబితా ఇస్తే త్వరగా పని పూర్తవుతుందన్నారు.
అందరితో కలిపి ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేస్తామని ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉంటే అందులో తెలియజేస్తే వివరణలతో నివృత్తి చేస్తామన్నారు.

ఈ శిక్షణ తరగతుల్లో సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, డిఆర్ఓ చంద్రశేఖర రావు, మచిలీపట్నం గుడివాడ ఆర్డీవోలు సాంబశివరావు, బాలసుబ్రమణ్యం, కే ఆర్ ఆర్ సి ఎస్ డి సి శ్రీదేవి, జడ్పి సిఈఓ కన్నమనాయుడు, డిపిఓ అరుణ, పలువురు తహసిల్దారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...