Skip to main content

జిల్లాలో మహిళా వ్యాపారవేత్తల ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం

మచిలీపట్నం :

జిల్లాలోని మహిళా వ్యాపారవేత్తలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు అన్ని విధాలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో కొనుగోలుదారులు... అమ్మకందారుల సమ్మేళనం అనంతరం స్వయం సహాయక సంఘాల మహిళ వ్యాపారవేత్తలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించే క్రమంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.
 ప్రతి మహిళా వ్యాపారవేత్తకు సంబంధించి ఇంస్టాగ్రామ్ ఖాతాను తెరిపించాలని, ఇప్పటికే 78 మందికి తెరిపించడం జరిగిందని, మిగిలిన వారందరికీ కూడా ఇంస్టాగ్రామ్ ఖాతాను తెరిపించి అందులో ఏ విధంగా ఉత్పత్తుల వివరాలు పోస్టింగ్ చేయాలో అవగాహన కల్పించాలన్నారు. డిజిటల్ మార్కెటింగ్ లో కూడా వారికి శిక్షణ ఇవ్వాలన్నారు. 

విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులను సంప్రదించి వారి కార్యాలయం వద్ద కూడా ఎస్ హెచ్ జి మహిళలు తయారుచేసిన ఉత్పత్తులను ప్రదర్శించేలా చూడాలన్నారు. హోటల్ సంఘాలు, యజమానులతో మాట్లాడి ఎస్ హెచ్ జి వ్యాపారవేత్తలు తయారుచేసిన పచ్చళ్ళు, ఊరగాయలు వంటి ఉత్పత్తులను అమ్ముకునే ఏర్పాటు చేయాలన్నారు. 

ఆవకాయ డాట్ కాం యాజమాన్యంతో కూడా మాట్లాడి ఎస్ హెచ్ జి వ్యాపారవేత్తలను అనుసంధానం 
చేయడంతో పాటు వారికి వచ్చిన ఆర్డర్లను ఏ విధంగా బట్వాడా చేయాలి, నాణ్యతా ప్రమాణాలు విధిగా పాటించడంలో ఒక ప్రణాళిక ఉండేలా చూడాలన్నారు. 
పీఎంఈజీపి, పిఎం ఎఫ్ఎంఈ తదితర రుణాల కోసం వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి రుణాలు మంజూరు చేసి యూనిట్లు నెలకొల్పేందుకు చొరవ చూపాలన్నారు. 

ఆసక్తి కలవారికి టైలరింగ్ లో శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు కూడా పి..ఫోర్ బంగారు కుటుంబాలు మార్గదర్శి ద్వారా విరాళంగా అందజేసి వివిధ రకాల గుడ్డల సంచులు తయారీకి సిద్ధం చేయాలన్నారు. 

సామాజిక మాధ్యమాల ను ప్రభావితం చేసే వారిని కూడా సంప్రదించి వారి ద్వారా మహిళ వ్యాపారవేత్తల ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలు తయారుచేసిన వివిధ రకాల ఉత్పత్తులను మరింతగా ప్రోత్సహించేందుకు ఇదివరకు నిర్వహించిన విధంగా సరస్ మేళాలు ఏర్పాటు చేసేందుకు చొరవ చూపాలన్నారు.

ఈ సమావేశంలో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్ కల్పన, డిఆర్ఓ చంద్రశేఖర రావు, డిఆర్డిఏ పిడి హరిహరనాథ్, శిక్షణలో ఉన్న ఉప కలెక్టర్ నిఖిల, ఎల్డీఎం రవీంద్రారెడ్డి, డిఐసి జిఎం వెంకటరావు, జిల్లా ఉద్యాన అధికారి జే జ్యోతి, ఆహార భద్రత అధికారి గోపాలకృష్ణ, ఎన్ఐసి ఏ డి ఐ ఓ సెల్వినా తదితర అధికారులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...