Skip to main content

మనిషి మనుగడకు నీరు ప్రాణాధారం: ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు

మచిలీపట్నం :

       మనిషి మనుగడకు నీరు ప్రాణాధారం అని, ఆరోగ్యవంతమైన జీవనం కోసం ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన, సురక్షిత తాగునీటిని వినియోగించడం అత్యంత అవసరమని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు అన్నారు. 
      మచిలీపట్నం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో వెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్వో తాగునీటి ప్లాంటును ఆయన ప్రారంభించారు. మండుతున్న ఎండల్లో దాహార్తితో అలమటించే ప్రయాణికులకు రోజుకు సుమారు 1000 లీటర్ల సురక్షిత తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం ప్రశంసనీయమని కొనియాడారు.
       వెలుగు ఫౌండేషన్ అధ్యక్షులు చందమామ బాబు ఆధ్వర్యంలో గత పదేళ్లుగా నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహించడం సమాజానికి ఆదర్శమని ఆయన అన్నారు. ఆర్వో ప్లాంట్ ఏర్పాటుకు అమెరికాలో నివసిస్తున్న రాడవరపు నాగేశ్వరావు అందించిన సహకారం ఉదారతకు ప్రతీకగా నిలుస్తుందని కొనకళ్ళ అభిప్రాయపడ్డారు. ప్లాంట్ నిర్వహణ కోసం ఐదు సంవత్సరాలపాటు సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని, సంబంధిత ప్రతినిధులకు ఆయన చేతుల మీదుగా చెక్కును అందజేశారు.
      ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షులు చందమామ బాబు మాట్లాడుతూ, నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి కొరతను దృష్టిలో ఉంచుకుని, అవసరమైన చోట్ల ఇలాంటి ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు కృషి కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి విశేషంగా సహకరించిన కంచనపల్లి కృష్ణమోహన రావు దంపతులను ప్రజా రవాణా శాఖ తరపున కొనకళ్ళ నారాయణరావు ఘనంగా సత్కరించారు.
         ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ టి. పెద్దిరాజు, ఫౌండేషన్ కార్యదర్శి కంచనపల్లి కృష్ణమోహన్ రావు, ఉపాధ్యక్షులు రేపల్లె వసంతరావు, పి. హరి రామకృష్ణ, కే. విజయ్, వేణు కుమార్, జి. రమాదేవి, ఉద్యోగులు, వివిధ కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...