Skip to main content

జనాభా లెక్కల పై జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయి సమావేశం

మచిలీపట్నం :

    జనాభా లెక్కల సేకరణ ఎలాంటి తప్పులు లేకుండా వాస్తవాలను ప్రతిబింబించే విధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జిల్లా జనాభా లెక్కల అధికారి డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ విసి హాల్లో జనాభా లెక్కల సేకరణ పై క్షేత్రస్థాయిలో ట్రైనర్లు అయిన ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. 
     ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జనాభా లెక్కల సేకరణ చాలా ముఖ్యమైన కార్యక్రమం అన్నారు. జనాభా లెక్కలు సేకరించే సమయంలో చాలా జాగ్రత్తగా విధులు నిర్వహించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏమైనా నిర్ణయాలు తీసుకోవాలంటే జనాభా లెక్కల ఆధారంగా తీసుకోవడం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఇచ్చే విషయంలో ఈ జనాభా లెక్కలు ఎంతో ఉపయోగపడతాయన్నారు.ఎన్ని రకాల సర్వేలు ఉన్నప్పటికీ జనాభా లెక్కల వివరాల సేకరణ చాలా ముఖ్యమన్నారు. తప్పులు లేకుండా సజావుగా జనాభా లెక్కలు సేకరించాలన్నారు.వాస్తవాలు చెబితే ప్రస్తుతం పొందుతున్న పథకాల ప్రయోజనాలు దూరం అవుతాయని అపోహ కొందరిలో ఉంటుందన్నారు. కానీ నిజానికి అటువంటిది ఏమీ ఉండదని ధైర్యంగా ప్రజలు వారి వివరాలను తెలియజేయాలన్నారు.జనాభా లెక్కల సేకరణ లో కేవలం లెక్కలు, అంకెలు మాత్రమే ఉంటాయని ఇతరత్రా మనుషుల పేర్లు ఉండవని కలెక్టర్ స్పష్టం చేశారు. ఉదాహరణకు వాయు కాలుష్యం తగ్గించాలన్న, రహదారుల విస్తరణ చేయాలన్న వాహనాల వివరాలు వాటి సంఖ్య అవసరం ఉంటుందని అదే గనుక ఆ వివరాలు ఇవ్వకపోయినా నిధులు మనకు రాకుండా పోయే అవకాశం ఉందన్నారు. 
      జనాభా లెక్కల సేకరణకు ఓటు హక్కుకు ఎలాంటి సంబంధం లేదని నిర్భయంగా ప్రజలు వారి వివరాలను ఎన్యుమరేటర్లకు తెలియజేయాలన్నారు.ఈ తరగతుల్లో జనాభా లెక్కల సేకరణ రాష్ట్ర అదనపు సంచాలకులు ప్రసన్న కుమార్, డిఆర్వో చంద్రశేఖర రావు,, జిల్లా మాస్టర్ ట్రైనర్లు డిటిడబ్ల్యువో ఫణి ధూర్జటి, కృష్ణ విశ్వ విద్యాలయం ఆచార్య శ్రావణి, శిక్షణ పొందుతున్న పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...