Skip to main content

క్షయ రహిత సమాజమే మన లక్ష్యం..డీఎంహెచ్వో యుగంధర్

మచిలీపట్నం : 

        క్షయరహిత సమాజమే మన లక్ష్యం అని కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పి యుగంధర్ అన్నారు. జిల్లా లెప్రసీ ఎయిడ్స్ టీబి నియంత్రణకు మనమంతా సమిష్టిగా పాటుపడదామని యుగంధర్ పిలుపు నిచ్చారు. టిబి ముక్తభారత్ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన 100 రోజుల ప్రత్యేక అభియాన్ ను మార్చి 2025 నుండి దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలకు, ఈ కార్యక్రమాన్ని విస్తరించడం జరిగిందని చెప్పారు.                      మంగళవారం ప్రపంచ క్షయ వ్యాధి నివారణ
 దినోత్సవం సందర్భంగా  వంద రోజులు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యక్రమాల్ని రూపొందించిందన్నారు. టీబీ లక్షణాలు లేకపోయినా ప్రమాదంలో ఉన్న ప్రజలకు ముందస్తు స్క్రీనింగ్ , ఏఐ ఆధారిత గుర్తింపు, హ్యాండ్ హెల్డ్ ఎక్స్ రే తదితర పరికరాల వినియోగంతో టీబి కేసులను త్వరగా గుర్తించనున్నమని చెప్పారు. మొబైల్ మెడికల్ యూనిట్లు నిక్షయ వాహనాలతో గ్రామీణ ప్రాంతంలో విస్తృతంగా సేవలు అందిస్తున్నట్లుగా తెలిపారు. అదేవిధంగా ఆరోగ్య శిబిరాల ద్వారా వివిధ పరీక్షలు నిర్వహించడం, నిశ్చయమిత్ర ద్వారా పోషకాహార సహాయం అందించడం, అవగాహన కార్యక్రమాలు చేపట్టడం వల్ల టీబి నిర్మూలనను వేగవంతం చేయాలని ప్రభుత్వం కృత నిశ్చయముగ ఉందని తెలిపారు. ప్రస్తుతం సిబి నాట్, ట్రూ నాట్ వంటి ఆధునిక పరీక్షలతో వేగంగా టీబి నిర్ధారణ జరుగుతోందన్నారు. 
       నిక్షయ్ పోర్టల్ ద్వారా ప్రతి రోగిని ట్రాక్ చేస్తూ నిక్షయ్ పోషణ యోజన కింద పోషకాహార సహాయం అందిస్తున్నామన్నారు. జిల్లాలో టీబీ కేసులు నియంత్రణలో ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కొత్త కేసులు నమోదు అవుతున్నాయని డి ఎం హెచ్ ఓ ఆవేదన వ్యక్తం చేశారు. టీబి ముక్తభారత్ లక్ష్యంతో టీబీ నియంత్రణ చికిత్స నివారణ చర్యలపై సిబ్బందితో కలిసి అవగాహనా ర్యాలీ నిర్వహించారు. 
      ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ  టి బి రోగులను వివక్షకు గురి చేయకుండా మానసికంగా వారిలో దృఢత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచాలన్నారు. ప్రతి ఒక్కరూ టీబి నిర్మూలన లో భాగస్వామ్యం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా లెప్రసీ ఎయిడ్స్ టీబి అధికారి డాక్టర్ అంబటి కాంతారావు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ప్రేమ్ చంద్, వైద్యాధికారులు, అసిస్టెంట్ సర్జన్ గోపాలకృష్ణ, రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ హరికృష్ణ, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...