Skip to main content

కూచిపూడి గ్రామాన్ని సాంస్కృతిక వారసత్వ సంపద తీర్చిదిద్దుటకు నివేదికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ



మచిలీపట్నం:

ప్రముఖ నాట్య క్షేత్రమైన కూచిపూడి గ్రామాన్ని సాంస్కృతిక వారసత్వ సంపద కేంద్రంగా తీర్చిదిద్దుటకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. 

గురువారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ పెనమలూరు నుండి మచిలీపట్నం వస్తూ శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఉపకులపతి మునిరత్నం నాయుడుతో కలసి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఠాగూర్ సాంస్కృతిక సముదాయం పథకం కింద కూచిపూడి లో ఒక ఆడిటోరియం మ్యూజియం ఏర్పాటు చేయుటకు అవసరమైన ప్రతిపాదనలతో ఏజెన్సీ ద్వారా సమగ్ర ప్రాజెక్టు నివేదికను (డిపిఆర్) తయారు చేయాలన్నారు. 

ఇందుకోసం స్థలము నిర్ధారణ చేయాలన్నారు. మొవ్వ మండల తాసిల్దారు చొరవ తీసుకొని ఉప కులపతితో సమన్వయం చేసుకొని మ్యాపింగ్ సిద్ధం చేయాలన్నారు.

సాంస్కృతిక విభాగం నిపుణులు తాడేపల్లి మాట్లాడుతూ తనకు ఎన్సీఈఆర్టీ నుండి కొంత అవగాహన ఉందని బహుళ ప్రయోజన సాంస్కృతిక సముదాయం నిర్మిస్తే బాగుంటుందన్నారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ సముదాయంలో పేరొందిన కళారూపాలతో దుకాణాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తో అధికారులతో మాట్లాడి సాంస్కృతిక నిధులు ఏమేమి ఉన్నాయో క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు. కూచిపూడి గ్రామంలోని సత్రాన్ని వారసత్వ సంపదగా మార్చేందుకు పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దేందుకు ఉన్న అవకాశాలను సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు.

అంతేకాకుండా సిద్ధేంద్ర యోగి నివసించిన ఇంటిని ఆయన స్మృతులను గుర్తు చేసుకుంటూ వారసత్వ సంపద కేంద్రంగా మలిచేందుకు ఆలోచించాలన్నారు. ఇందుకోసం వారి కుటుంబ సభ్యులతో ఒకసారి మాట్లాడాలన్నారు. కూచిపూడి పరంపర కింద. పొందే ఉపకార వేతనాల గురించి విస్తృతంగా తెలియజేయాల్సి ఉందన్నారు. 

కోనేరు నుండి అంతర్గత రహదారులు నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తక్కువ కాలంలో కూచిపూడి నేర్చుకునే కోర్సులను ప్రవేశపెట్టాలన్నారు.
అందుకు ఉపకులపతి వెంటనే స్పందిస్తూ వచ్చే మే నెలలో 15 రోజులు, 21 రోజులతో కోర్సులు చేపట్టుటకు తగిన నిర్ణయం త్వరలో తీసుకుంటామని ఇందుకోసం ఈనెల 23వ తేదీన డైరెక్టర్లతో మండలి సమావేశం నిర్వహిస్తున్నామన్నారు 

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పర్యాటక శాఖ ఏడి లజ్వంత నాయుడు, ఏపీటీడీసీ ఎస్ ఈ ఈశ్వరయ్య, చీఫ్ మార్కెటింగ్ అధికారి పద్మారాణి, , డిఆర్డిఏ పిడి హరిహరనాథ్, జిల్లా పర్యాటక అధికారి రామ్ లక్ష్మణ్, పంచాయతీరాజ్ ఎస్ ఈ రమణ రావు, రహదారులు భవనాల శాఖ ఈఈ లోకేష్,, పర్యాటక కన్సల్టెంట్ పద్మావతి, మొవ్వ మండల తహసిల్దార్ మస్తాన్, ఎంపీడీవో సుహాసిని తదితర అధికారులు పాల్గొన్నారు. 

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...