Skip to main content

రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోంది –– మంత్రి కొల్లు రవీంద్ర

జిల్లా స్థాయి ఇఫ్తార్ లో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డీకే బాలాజి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు తదితరులు

మచిలీపట్నం: 

రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, రాష్ట్రంలోని ముస్లిం సోదరుల అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తున్నామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

 నగరంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో జిల్లా మైనారిటీల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఇఫ్తార్ లో మంత్రి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి పాల్గొన్నారు. వారు ముస్లిం సోదరులతో కలిసి  ప్రార్థనలు నిర్వహించి, అందరికీ రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేశారు. 
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రంజాన్ మాసం త్యాగం, సహనానికి ప్రతీక అని, సమాజంలో ఐక్యత, ప్రేమ, సౌబ్రాతృత్వాన్ని పెంపొందించే పర్వదినమని తెలిపారు. ముస్లిం సోదరుల ప్రార్థనలు సర్వ మానవాళికి రక్షణ కలిగిస్తాయని అన్నారు. ముస్లిం సోదరులందరూ అత్యంత పవిత్రంగా, ఎంతో నిష్టతో రంజాన్ మాసాన్ని పాటిస్తారన్నారు. సూర్యోదయానికి ముందు (సహర్) నుండి సూర్యాస్తమయం (ఇఫ్తార్) వరకు అన్నపానీయాలు మాని, కఠినమైన ఉపవాసం పాటించటం గొప్ప విషయమని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక ఇమామ్ లు, మౌజన్ లకు దాదాపు రూ.180 కోట్లు చెల్లించిందని, అలాగే మసీదులు, దర్గాల మరమ్మతుల కోసం నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. ముస్లిం సోదరులు పవిత్రంగా భావించే హజ్ యాత్ర కోసం విజయవాడలో హజ్ భవనం నిర్మాణ పనులు నాడు 2014 – 19 కాలంలో ప్రారంభించామని, తర్వాత అది నిర్లక్ష్యానికి గురైందని, ప్రస్తుతం తిరిగి ఆ భవనాన్ని పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. కడపలో కూడా దర్గా నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ముస్లిం మైనారిటీల సంక్షేమానికి బడ్జెట్లో 6,090 కోట్లకు పైగా కేటాయింపులు చేశామని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. 
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, ఒక కుటుంబం ఒక వ్యాపారవేత్త అనే నినాదంతో ముందుకు సాగుతోందని, ముస్లిం సోదరులలో ఎవరైనా వ్యాపారవేత్తలు కావడానికి ముందుకొస్తే వారికి ప్రభుత్వం తరుపున అన్ని విధాల ఆర్థిక తోడ్పాటు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ ప్రపంచ శాంతి, ఐక్యత, మానవత్వానికి ప్రతీకగా రంజాన్ మాసాన్ని ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా పాటిస్తారని పేర్కొంటూ వారందరికీ రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేశారు.
కార్యక్రమంలో గవర్నమెంట్ ఖాజీ మహమ్మద్ హుస్సేన్, జామియా మసీద్ ఇమామ్ రఫీక్ హాలాం, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ బండి రామకృష్ణ, గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, రాష్ట్ర మైనారిటీ డైరెక్టర్ హసీం బేగ్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ దిలీప్ కుమార్, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఫణి కుమార్, జిల్లా మైనారిటీల సంక్షేమ శాఖ అధికారి రబ్బానీ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, జెడ్పీ సీఈవో కే కన్నమనాయుడు, డిప్యూటీ సీఈవో డాక్టర్ ఆనంద్ కుమార్, బందరు ఆర్డీవో కే సాంబశివరావు, ముస్లీం మత పెద్దలు అబ్దుల్ అజీమ్, కాజా తదితర మత పెద్దలు ఇలియాస్ పాషా తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...