Skip to main content

తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు


మచిలీపట్నం, 7మార్చి 2026, SSN:

       కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు పార్టీ కార్యాలయంలో అత్యంత వైభవంగా జరిగాయి.
ఈ సందర్భంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన మహిళలను మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వీరంకి వెంకట గురుమూర్తి, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ, కృష్ణా జిల్లా మహిళా అధ్యక్షురాలు తలసిల స్వర్ణలత ఘనంగా సన్మానించారు 
        తొలుత మహిళలకు టిడిపి తరఫున పసుపు కుంకుమ, తాంబూలం, గాజులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు ఆనందోత్సవాలతో పాల్గొన్నారు. మహిళా మణులు నిర్వహించిన కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు.  మహిళా సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ఆది నుండి కట్టుబడి ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారన్నారు. మహిళలు మరింత చైతన్యవంతులు కావాలని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మంత్రి కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
        ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ మహిళలకు ఆస్తి హక్కును కల్పించి మహిళలకు అండగా నిలిచింది అన్న నందమూరి తారక రామారావు అని అన్నారు.మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు. రాజకీయంలోకి కూడా రావాలని ఆయన ఆకాంక్షించారు. మహిళలే మహారాణులని ఆయన ఈ సందర్భంగా కీర్తించారు.
        కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వీరంకి వెంకట గురుమూర్తి మాట్లాడుతూ కృష్ణాజిల్లాలో వివిధ రంగాలలో ప్రతిభ చాటిన మహిళా మణులకు శనివారం సత్కారం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మహిళను గౌరవించడం మన సంప్రదాయమని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత అన్న నందమూరి తారక రామారావు మహిళలకు స్థానిక సంస్థలలో 8 శాతం రిజర్వేషన్ కల్పించారని అన్నారు. అదేవిధంగా మహిళలకు ఆస్తిలో హక్కు, పద్మావతి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలను విద్య పరంగా డ్వాక్రా పథకం ప్రవేశపెట్టి ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లారని, ఈ విధంగా మహిళా సాధికారతకు పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అలాగే ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసి మహిళల పట్ల కూటమి ప్రభుత్వంనకు ఉన్న నిబద్ధతను తెలియజేసిందన్నారు. అదేవిధంగా మహిళలు రానున్న రోజుల్లో మరింత ఎత్తుకు ఎదగాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. 
       ఈ సందర్బంగా డాక్టర్స్ విభాగం నుండి సాయి లలిత, సేవారంగం నుండి మరీదు మాధవి లత, కరెడ్ల సుశీల, విద్యా రంగం నుండి లింగమనేని స్రవంతి, కూచిపూడి నృత్యం నుండి కంచిపట్ల వెంకట జ్యోతి, పారిశ్రామిక రంగం నుండి జంపాన నాగ దుర్గ, నాటక రంగం నుండి నత్త కమల కుమారి, స్పోర్ట్స్ రంగం నుండి నగిడి గాయత్రి, విజయ కుమారి, కోలాటం నుండి పలపత్తి పద్మజ, అంగన్వాడీ టీచర్ గా రత్న శ్రీ, ఉత్తమ ఆయాగా నాగేంద్రమ్మ, ఆశ వర్కర్ గా కోటేశ్వరమ్మ, ఏఎన్ఎం గా సుంకర మంగమ్మ, డ్వాక్రా సంఘం నుండి సత్య శ్రీ, ఆర్టీసీ రంగం నుండి బోలెం విజయలక్ష్మి, ప్రకృతి వ్యవసాయం నుండి కొనగల ఉమాలక్ష్మి, మున్సిపాలిటీ నుండి కడవకొల్లు అరుణశ్రీ, పోలీస్ రంగం నుండి కేసన బేబీ , అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో విశిష్ట సేవలు చేసిన ఏడు నియోజకవర్గాల నుండి లంకెశెట్టి నీరజ, వాలిశెట్టి హేమావతి, నూతి సుభాషిని, గుండేటి సుమతీరాణి, బత్తుల అని మేరీ లాజరస్, గుత్తికొండ పద్మావతి, మండవ బాల త్రిపుర సుందరి, విశ్వనాథపల్లి పాప, కోటేశ్వరమ్మ, దండమూడి లక్ష్మి, పండ్రాజు సుధారాణి, యార్లగడ్డ సుధారాణి, వేమూరి సుజాత, తుమ్మ కామేశ్వరి, రేవు నాగలక్ష్మి తదితరులను ఘనంగా సత్కరించారు. 
       ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యనిర్వహ కార్యదర్శి కొనకళ్ళ జగన్నాథరావు( బుల్లయ్య ), జిల్లా ఉపాధ్యక్షులు మోటమర్రి బాబా ప్రసాద్, జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి బత్తిన దాస్, రాష్ట్ర తెలుగు మహిళ నాయకులు ముల్పూరి సాయి కళ్యాణి, జిల్లా నాయకులు యార్లగడ్డ సుచిత్ర, మైనేని ఇందిరా, పొదిలి లలిత, కొల్లి రమ్య, సాయి సుధా, సుంకర లక్ష్మి, కడవకల్లు కుమారి, తెలుగు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...