మచిలీపట్నం:
కృష్ణా జిల్లా మచిలీపట్నం నగరం, రూరల్ మండలములలో వేంచేసియున్న శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానము బందరు కోట, శ్రీ ఏకాంబరేశ్వర స్వామి వారి దేవస్థానం బందరు కోట, శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం సర్కిల్ పేట, శ్రీ జగన్నాధ స్వామి వారి దేవస్థానం జగన్నాధపురం దేవాలయాలలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల సమయములలో దేవదాయ ధర్మదాయ శాఖ కు చెందిన అధికారుల పర్యవేక్షణలో సదరు ఏరియాలకు చెందిన పోలీస్, రెవెన్యూ అధికారులు, గ్రామ పెద్దలు, ధర్మకర్తల మండలి వారి సమక్షములో 30వ తేదీ సోమవారం ఈ దేవస్థానములలో హుండీలు తెరచి లెక్కించబడును. సదరు హుండీ కౌంటింగ్ లకు ఆసక్తి ఉన్న భక్తులు, గ్రామ పెద్దలు పాల్గొనవలసినదిగా దేవస్థానముల కార్యనిర్వహణాధికారి కొండవీటి మురళీకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు.
Comments
Post a Comment