Skip to main content

అంతా 'రామమయం'.! 'శ్రీరామ' నామంతో పులకించిన నగరం.!



స్వామివారికి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పట్టు వస్త్రాల సమర్పణ
మచిలీపట్నం:

     నగరంలో శుక్రవారం తెల్లవారుజాము నుండి వివిధ దేవాలయాల్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు తండోపతండాలుగా రామచంద్ర మూర్తిని దర్శించుకున్నారు. రుస్తుంబాదలో కొలువై ఉన్న శ్రీ భద్రాద్రి రామాలయ దేవస్థానాన్ని నగరంలోని వివిధ రామాలయాలని దర్శించుకుని తరించారు. రామాలయాలన్నీ విద్యుత్ దీప కాంతులతో అలరారుతున్నాయి. పలు దేవాలయాల్లో భక్తి, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
         జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ దంపతులు కుటుంబ సమేతంగా రుస్తుంబాద భద్రాద్రి శ్రీ రామాలయంలో శ్రీరాములవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కుటుంబ సమేతంగా స్వామి వారి దర్శనం చేసుకున్నారు. శ్రీరామ కళ్యాణాన్ని తిలకించారు. దేవస్థాన ఈవో వై. శిరీష కలెక్టర్ దంపతులకు స్వాగతం పలికారు. ఈ ఓ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. దేవస్థాన చైర్మన్ శ్రీమంతు రాజా యార్లగడ్డ రామనాథ్ దేవి ప్రసాద్ దంపతులు, దేవస్థాన నిర్వహణ కమిటీ సభ్యులు కుటుంబ సమేతంగా స్వామి వారి కళ్యాణాన్ని నిర్వహించారు. అశేష సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. స్వామివారి కళ్యాణ అనంతరం దాదాపు 5 వేల మందికి పైగా భక్తులకు దేవస్థాన ప్రాంగణంలో ఆలయ ఈ. ఓ. సారధ్యంలో అన్నప్రసాద వితరణ నిర్వహించారు.

        స్థానిక రాబర్ట్ సన్ పేట శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో 101 మంది దంపతులు శ్రీరామ కళ్యాణాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. దేవస్థాన చైర్మన్ దేసు నీరజ దంపతులు, నిర్వహణ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో సమ్మెట ఆంజనేయస్వామి దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. పోలీసు రామాలయంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ప్రసాదాన్ని అందించారు. స్థానిక కోనేరు సెంటర్లో పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ సెంటర్, గొడుగు పేట, రాజుపేట, రామాలయం, జవార్ పేట, లక్ష్మీ టాకీస్ సెంటర్, రామానాయుడు పేట ,చిలకలపూడి గోడౌన్స్ వద్ద గల దేవాలయం, జిల్లా పరిషత్ సెంటర్, వలంద పాలెం తదితర దేవాలయాల్లో శ్రీరామ కళ్యాణాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. నగరమంతా శ్రీ రామ నామస్మరణతో మారుమ్రోగింది.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...