మచిలీపట్నం ప్రతినిధి:
నగరంలో ఆదివారం మాని కొమ్మల(మట్టల) పవిత్ర ఆదివారాన్ని క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత నిర్మల హైస్కూల్ నుండి అలంకరించిన మట్టలను చేతబూని నాయర్ బడ్డి సెంటర్ మీదుగా పోలీస్ కళ్యాణ మండపం దాటి ఆర్.సి.ఎమ్. చర్చి వరకు ఊరేగింపు జరిపారు. అనంతరం ఫాదర్ డేవిడ్ రాజు, బొడ్డు ఆనందబాబు, సహాయకులు ప్రసంగిస్తూ యేసు సువార్తను ప్రతి ఒక్కరూ ఆచరించి జీవిత పరమార్థానికి చేరుకోవాలని, మానవ జన్మ ఎత్తి ఏసు పరోపకారం నిర్వహించాదని ఆయన మార్గంలో నడవాలని ప్రతి ఒక్కరికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులతో పాటు వివిధ క్రైస్తవ సంఘీయులు పాల్గొన్నారు.
Comments
Post a Comment