Skip to main content

విద్యార్థులకు ఉన్నత ప్రమాణాల విద్య, మెరుగైన వాతావరణ కల్పన –– జిల్లా కలెక్టర్

మచిలీపట్నం: 

జిల్లాలోని ప్రతి పాఠశాల విద్యార్థులకు ఉన్నత ప్రమాణాల విద్యతో పాటు మెరుగైన వాతావరణం కల్పించేందుకు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు.

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల చేరికలు, ప్రత్యేక విద్యా కార్యక్రమాల అమలుపై జిల్లా కలెక్టర్ గురువారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో విద్యాశాఖ అధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆటిజం సెంటర్లు, యోగ సదుపాయాలు, స్మార్ట్ కిచెన్లు, ఎక్సలెన్స్ సెంటర్ల ఏర్పాటు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకగా చేపట్టిన 'లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్' (లీప్) కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాలలను తీర్చిదిద్దాలని కలెక్టర్ సూచించారు. సమ్మిళిత విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి ఆధారిత బోధన, పరిశోధన-సృజన, ప్రపంచ స్థాయి విద్యాప్రణాళిక అనే ఐదు అంశాల ప్రాతిపదికన ఈ స్కూళ్లను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

అలాగే ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు (ఎన్రోల్మెంట్) పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం క్షేత్రస్థాయిలో తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడి అవగాహన కల్పించాలని సూచించారు. పాఠశాలల అభివృద్ధిలో ఆయా స్కూళ్లలో చదివిన పూర్వ విద్యార్థులను గుర్తించి, వారిని అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం చేయాలని కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. 
సమావేశంలో డీఈవో యు వి సుబ్బారావు, సమగ్ర శిక్ష ఏపీసీ ఆర్ కుముదిని సింగ్, ఏపీఈడబ్ల్యూఐడిసి ఈఈ రాయన్న, నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు డ్వామా పీడీ ఎన్ శివప్రసాద్ యాదవ్, మార్క్ఫెడ్ డిఎం మురళీ కిషోర్, మార్కెటింగ్ శాఖ ఏడి నిత్యానంద్, మెప్మా పీడీ సాయిబాబు, పశుసంవర్ధక శాఖ అధికారి చిననరసింహులు, ఐసిడిఎస్, సాంఘిక సంక్షేమ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...