Skip to main content

ఉద్యోగుల నుండి 9 అర్జీలు ప్రజలనుండి 112 ఆర్జీలు

మచిలీపట్నం :

సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో డిఆర్ఓ చంద్రశేఖర రావు, పి జి ఆర్ ఎస్ నోడల్ అధికారి, విజిలెన్స్ ఎస్ డి సి పోతురాజు, మెప్మా పీడీ సాయి బాబు, డిఎస్పి శ్రీనివాసరావు లతో కలిసి తొలుత ఉద్యోగుల సమస్యల పరిష్కార దినం అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదిక.....మీకోసం కార్యక్రమం నిర్వహించి జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. 

 కలెక్టరేట్లో మొత్తం 9 అర్జీలు ప్రభుత్వ ఉద్యోగుల నుండి, 112 అర్జీలు ప్రజల నుండి జిల్లా యంత్రాంగం స్వీకరించింది. అందులో కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి:

ఏలూరు జిల్లా కలిదిండి గ్రామస్తులు కలిదిండి వెంకటేశ్వరరావు పంచాయతీరాజ్ శాఖలో అటెండర్గా పనిచేస్తున్నానని వచ్చే ఏప్రిల్ మాసంలో తాను పదవీ విరమణ పొందుతున్నానని, అలోగా తనకు బిల్ కలెక్టర్ పదోన్నతి కల్పించాలని కోరగా జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ కార్యాలయం పరిపాలన అధికారి సీతారామయ్యకు సూచించారు

మోపిదేవి మండలం కోసూరు వారి పాలెం గ్రామానికి చెందిన దివ్యాంగురాలు సనక పరిపూర్ణమ్మ (86) తన చిన్న కోడలు రామబాణం సహాయంతో చక్రాల కుర్చీలో కలెక్టరేట్ వద్దకు రాగా జిల్లా కలెక్టర్ వేదిక నుండి దిగి స్వయంగా ఆమె వద్దకు వచ్చి ఆమె భూ సమస్యను తెలియజేయగా ఎంతో ఓపికగా ఆలకించి డిఎస్పి శ్రీనివాసరావును పిలిపించి పోలీస్ కేసు నమోదు చేసి వారికి న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు.

మచిలీపట్నం విశ్వబ్రాహ్మణ కాలనీ ఆర్టీసీ కాలనీకి చెందిన గుడివాడ ధర్మారావు తాను వృద్ధాప్యంలో ఉన్నానని, తన కుమారుడు బసవేశ్వరావు తనను పట్టించుకోవడంలేదని, తన ఆస్తిని అమ్ముకొనుటకు ప్రయత్నిస్తున్నాడని ఫిర్యాదు చేస్తూ తన కుమారునికి ఎలాంటి పత్రాలు లేకపోయినా అతని పేరిట పన్ను వస్తుందని, ఆ పన్నులను తాను చెల్లిస్తున్నానని ఈ విషయం సచివాలయం సిబ్బందికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని ఇకనైనా పన్ను నోటీసులో తన పేరు వచ్చేలా మార్పు చేయాలని కోరుతూ అర్జీ అందజేశారు. 

ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఇ సోమశేఖర్, జెడ్పి డిప్యూటీ సీఈవో ఆనంద్ కుమార్, ఆర్ అండ్ బి ఈ ఈ లోకేష్, ఎల్డీఎం రవీంద్రారెడ్డి ,బిసి కార్పొరేషన్ ఈడీ రాజేంద్ర బాబు, ఐసిడిఎస్ పిడి ఎంఎన్ రాణి, డ్వామా, డిఆర్డియే పి డి లు శివప్రసాద్, హరిహరనాథ్, డిపిఓ అరుణ జిల్లా ఉద్యాన అధికారి జ్యోతి, ఆర్టీవో ఎన్ యు ఎన్ ఎస్ శ్రీనివాసరావు, డిఐసి జీఎం వెంకటరావు, డిఇఓ సుబ్బారావు, మచిలీపట్నం ఇన్చార్జి డిఎస్పీ ధర్మేంద్ర తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...