Skip to main content

కృష్ణా విశ్వవిద్యాలయంలో మహిళా సాధికారతపై వాకథాన్

మచిలీపట్నం :

       ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ సూచనల మేరకు మహిళా సాధికారత కార్యక్రమాలను ప్రోత్సహించే ఉద్దేశంతో కృష్ణా విశ్వవిద్యాలయం మహిళా సాధికారత సమన్వయకర్త డా. ఎల్. సుశీల  ఆధ్వర్యంలో వాకథాన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. విద్యాసంస్థల్లో మహిళా సాధికారత కార్యక్రమాలను బలోపేతం చేయడానికి విద్యార్థులు, అధ్యాపకులను అంబాసిడర్లుగా నామినేట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు సూచించిన నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
      ఈ కార్యక్రమానికి కృష్ణా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కూన రామజీ  ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు సందేశం అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మహిళల సాధికారతకు అవగాహన అత్యంత అవసరమని, యువత ముందుండి సమానత్వం, గౌరవం కలిగిన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం ద్వారా సమాజ అభివృద్ధి సాధ్యమవు తుందని పేర్కొన్నారు.
       విశ్వవిద్యాలయం రెక్టర్ ప్రొఫెసర్ ఎం.వి.బి. రావు  మాట్లాడుతూ వాకథాన్ వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని తెలిపారు. విద్యతో పాటు సమాజానికి సేవ చేసే భావన ప్రతి విద్యార్థిలో పెంపొందాలని సూచించారు.
      ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా. నవీన లావణ్య లత మహిళా సాధికారత, సమాన హక్కులు, మహిళల భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మహిళల పురోగతికి యువత చురుకైన పాత్ర పోషించాలని ఆమె పేర్కొన్నారు.
     మహిళా సాధికారత సమన్వయకర్త డా. ఎల్. సుశీల మాట్లాడుతూ మహిళల హక్కులు, సమాన అవకాశాలు, సురక్షిత సమాజ నిర్మాణంపై అవగాహన పెంపొందించడమే ఈ వాకథాన్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
     ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం అధ్యాపకులు ప్రొఫెసర్ మారుతి, శ్రీమతి అమల, డా. మాధురి, డా. రంగశ్రీ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది మహిళా సాధికారతపై నినాదాలతో వాకథాన్ నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...