Skip to main content

చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కు పాదం: జిల్లాఎస్పీ విద్యాసాగర్ నాయుడు

మచిలీపట్నం :

      చట్టవ్యతిరేక జూద కార్యకలాపాలపై కృష్ణాజిల్లా పోలీసుల ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారని కృష్ణాజిల్లా ఎస్పీ వి .విద్యాసాగర్ నాయుడు తెలిపారు.133 మంది జూదానికి అలవాటు పడిన వారిని కొంతమంది నిర్వాహకులను జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు.
        జిల్లాలో శాంతిభద్రతలను కాపాడటంతో బాటు ప్రజల ఆర్థిక, సామాజిక భద్రతను పరిరక్షించేందుకు కృష్ణాజిల్లా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారన్నారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ ను దృష్టిలో పెట్టుకొని జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా క్రికెట్ బెట్టింగ్, పేకాట, కోడిపందాలు వంటి చట్టవ్యతిరేక జూద కార్యకలాపాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరిగింది.
        ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా అన్ని సబ్ డివిజన్‌లు, సర్కిల్‌లు, పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, అనుమానాస్పద ప్రాంతాలు, పూర్వ చరిత్ర కలిగిన బెట్టింగ్ నిర్వాహకుల కదలికలు గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న జూద కేంద్రాలపై నిఘా ఉంచారు.
         జిల్లావ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, జూదానికి అలవాటు పడిన వ్యక్తులను గుర్తించి చర్యలు చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా జిల్లా వ్యాప్తంగా మొత్తం 133 మంది జూదానికి అలవాటు పడినవారు కొంతమంది నిర్వాహకులను అదుపులోకి తీసుకొని, వారిని సంబంధిత పోలీస్ స్టేషన్లకు తరలించారు. అనంతరం వారిపై బైండోవర్ చర్యలు తీసుకుని, కౌన్సిలింగ్ నిర్వహించి భవిష్యత్తులో ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించి విడుదల చేశారు.
          క్రికెట్ బెట్టింగ్, పేకాట, కోడిపందాలు వంటి జూద కార్యకలాపాలు వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా కుటుంబాలు, సమాజంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని తెలిపారు. ఈ కార్యకలాపాలు ప్రజలను ఆర్థికంగా దెబ్బతీయడమే కాకుండా నేరాలకు దారితీసే అవకాశాలు ఉన్నాయని, ఇకపై జిల్లాలో ఎక్కడైనా ఇటువంటి చట్టవ్యతిరేక జూద కార్యకలాపాలు నిర్వహించినా, లేదా ప్రోత్సహించినా, వారు ఎంతటి వారైనా సరే ఎటువంటి ఉపేక్ష లేకుండా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. 
          ప్రజలు కూడా ఇటువంటి కార్యకలాపాల గురించి సమాచారం ఉంటే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా 112 కు తెలియజేయాలని కోరారు.కృష్ణాజిల్లా పోలీసు యంత్రాంగం ప్రజల సహకారంతో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. త్వరలో గంజాయి, జూదం, బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రత్యేక హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...