Skip to main content

ఉచిత క్యాన్సర్ నివారణ శిబిరానికి అపూర్వ స్పందన

మచిలీపట్నం :

      కొంగర భవాని జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు కృష్ణా కమ్మవారి సంక్షేమ సంఘం, దివ్య డయాగ్నిస్టిక్స్ వారి సౌజన్యం తో కమ్మ వారి సంక్షేమ సంఘం భవనం లో సోమవారం ఏర్పాటుచేసిన  ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. 220 మంది పైగా పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ శిబిరాన్ని బందర్ మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, 1 వార్డు టీడీపీ ఇంచార్జ్ బత్తిన దాస్, కృష్ణా కమ్మ సంక్షేమ సంఘం అధ్యక్షులు వేమూరి బాలు, సెక్రటరీ చేకూరి కోటేశ్వరరావు, కోశాధికారి ఎంవీఎన్ ప్రసాద్ ప్రారంభిచారు. 
       ఈ సందర్భంగా గొర్రెపాటి గోపీచంద్ మాట్లాడుతూ అత్యంత ఖరీదైన క్యాన్సర్ పరీక్షలు ఉచితంగా చేయడం దీర్గ కాలముగా బాధపడుతున్న పేద ప్రజలకు ఎంతో ఉపయోగముగా ఉందని అన్నారు. బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ డాక్టర్ రవిశంకర్ మాట్లాడుతూ ఎంతకి మానని పుండు లేక కురుపు, రొమ్ము ప్రదేశం లో గాని మరియెక్కడైన గడ్డలు, చాలాకాలమగా గొంతు బొంగురు పోవడం ఇలాంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం మంచిది అని అన్నారు. డాక్టర్ శైలజ మాట్లాడుతూ క్యాన్సర్ ఆరంభ దశలోనే క్యాన్సర్ ని గుర్తిస్తే చికిత్స సులభం అవుతుందని అత్యంత అధునాతనమైన మొబైల్ వాహనం లో ఈ శిబిరానికి వచ్చినవారికి రొమ్ములకు మెమోగ్రఫీ, గర్భాశయాలకు స్కానింగ్, యోనికి పాప్ స్మియర్, ఊపిరితిత్తులకు ఎక్సరే పరీక్షలు ఉచితంగా  నిర్వహించి రిపోర్టులు ఇవ్వబడతాయని అన్నారు.
ఈ శిబిరంలో పరీక్షలు చేయించుకున్న వారందరికీ కృష్ణా కమ్మ సంక్షేమ సంఘం వారు అల్పాహారము, భోజన సదుపాయాన్ని కల్పించారు

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...