Skip to main content

జిల్లాలో పరిశ్రమల స్థాపనకున్న అడ్డంకలు తొలగిస్తాం : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

మచిలీపట్నం :

జిల్లాలో పరిశ్రమలకు ఎదురవుతున్న అడ్డంకులన్నీ తొలగిస్తామని పారిశ్రామికవేత్తలు సత్వరమే వారి యూనిట్లు స్థాపించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు.

గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ పెనమలూరు మండలంలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల సమావేశం మందిరంలో పరిశ్రమల స్థాపన... సంబంధిత సమస్యలు అనే అంశంపై సంబంధిత అధికారులు, పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించి సమీక్షించారు. 
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మల్లవల్లి, వీరపునేనిగూడెం పారిశ్రామిక వాడలలో పరిశ్రమలు నెలకొల్పుటకు పారిశ్రామికవేత్తలకు ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలువురు పారిశ్రామికవేత్తలు తమకు కేటాయించిన స్థలాలు లోతట్టుగా ఉన్నాయని వాటిని మెరక చేయుటకు మట్టి అవసరం ఉందని చెప్పారు. మట్టి దూర ప్రాంతం నుంచి తెచ్చుకోవడం వలన ఖర్చు అధికంగా ఉందని చెప్పారు.

పారిశ్రామిక వాడలో సరైన భద్రత లేదని, వాచ్మెన్ సరిగా విధుల్లో ఉండటం లేదని, వీధి దీపాలు వెలగడం లేదని, తాము తెచ్చుకున్న సామాగ్రి చోరీకి గురవుతుందని కలెక్టర్ దృష్టికి తీసుకుని వచ్చారు. రహదారేమో ఎత్తులో ఉందని మురుగునీటి వ్యవస్థ ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలియడం లేదన్నారు.
దీంతో జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ అధికారుల బృందం ఆ ప్రాంతాలను పరిశీలించి సమీపంలో ఎక్కడ నుంచి మట్టి తోలుకునేందుకు అవకాశం ఉందో చూసి పారిశ్రామికవేత్తలకు అనుమతించాలన్నారు.
ప్రస్తుతం ఉన్న వాచ్మెన్ సరిగా విధుల్లో లేని కారణంగా అతనిని తొలగించి అతని స్థానంలో ఇంకొకరిని నియమించాలని, అతని విధులను పర్యవేక్షించాలని సూచించారు. అంతేకాకుండా వీధి దీపాలు కూడా వెలిగేలా చూడాలని స్పష్టం చేశారు. సామాగ్రి దొంగలించకపోకుండా భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలన్నారు.

కొందరేమో తమకు కేటాయించిన స్థలము యూనిట్ నెలకొల్పుటకు సరిపోవటం లేదని, తాము కోరినంత స్థలము ఇవ్వలేదని, అందుకు బదులుగా వేరే స్థలం కేటాయించాలని కోరుతూ అవసరమైతే అదనంగా సొమ్ము చెల్లిస్తామని చెప్పడం జరిగింది . దీంతో కలెక్టర్ వెంటనే స్పందిస్తూ వారి అభ్యర్థనను ఒకసారి మరల పరిశీలించి ప్రస్తుతం ఉన్న స్థలాన్ని రద్దుచేసి దాని స్థానంలో వారు కోరినంత స్థలము ఇచ్చే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు.

మరి కొంతమంది పారిశ్రామికవేత్తలు వారు నెలకొల్పాలనుకున్న యూనిట్లకు సంబంధించి బ్యాంకు రుణాలు కోసం పదేపదే తిరగాల్సి వస్తుందని, రుణం మంజూరు చేయడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకుని వచ్చారు. దరఖాస్తులో ఉన్న లోటుపాట్లు ఒకేసారి చెప్పకుండా ఒక్కోసారి ఒక్కొక్క తప్పును చెబుతూ కాలయాపన చేస్తున్నారన్నారు.

దీనిపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ సంబంధిత పారిశ్రామికవేత్తల దరఖాస్తు వివరాలను స్వయంగా రాసుకుని సంబంధిత బ్యాంక్ అధికారులతో మాట్లాడుతామని చెప్పారు. అంతేకాకుండా ఈ నెల13 వ తేదీన బ్యాంక్ అధికారుల సమావేశం నిర్వహిస్తున్నామని , బ్యాంకు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వ్యాపారవేత్తల వివరాలను గూగుల్ స్ప్రెడ్షీట్లో సేకరించి ముందుగానే బ్యాంకులకు పంపడం జరుగుతుందన్నారు. సమావేశం రోజున రుణాల గురించి విచారిస్తామన్నారు.

కొందరు పారిశ్రామికవేత్తలు డాక్యుమెంట్ల ప్రకారం తమకు కేటాయించిన స్థల విస్తీర్ణం వాస్తవంగా భూమిపైన లేదని సరిహద్దుల సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. 
జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ సర్వేయర్ ను అక్కడికి పంపించి కొలతలు కొలిచి సరి చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో ఏపీఐఐసీ జడ్ఎం బాబ్జి, డిఐసి జిఎం వెంకటరావు, జిల్లా ఉద్యాన అధికారి జే జ్యోతి, ప్రత్యేక అధికారులు జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి షాహిద్ బాబు, గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధికారి వెంకటరావు, మార్కెటింగ్ ఎడి నిత్యానందం, డి సి ఓ చంద్రశేఖరు, ఆర్టీవో ఎన్ యు ఎన్ ఎస్ శ్రీనివాసరావు, డి ఎల్ డి వో లు సునీత శర్మ, రాజేష్ గనుల శాఖ ఏజీ కొండారెడ్డి పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. 

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...