Skip to main content

9వ తరగతి విద్యార్థులను 10వ తరగతికి సిద్ధం చేయాలి.. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డీకే బాలాజి


మచిలీపట్నం: 

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులను నిర్ధిష్ట ప్రణాళిక ప్రకారం 10వ తరగతికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ నగరంలోని తన క్యాంప్ కార్యాలయం నుండి విద్యాధికారులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి 9వ తరగతి విద్యార్థులను 2027 పదవ తరగతి పరీక్షలకు సంసిద్ధతపై మాట్లాడారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2027 ఎస్ ఎస్ సి బోర్డు పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేందుకు 9వ తరగతి నుంచే 10వ తరగతి సిలబస్‌ పై దృష్టి పెట్టాలని సూచించారు. దీనికోసం ఉపాధ్యాయులు, విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, ప్రత్యేక అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెబుతూ పలు సూచనలు చేశారు. 

విద్యార్థులు వేసవి సెలవులను వృధా చేయకుండా నిర్దిష్ట ప్రణాళికతో పదవ తరగతి పాఠ్యాంశాలను చదువుకుంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిరోజు ఉదయం 5 గంటలకే నిద్రలేవటం, రాత్రికి ముందుగానే నిద్రకు ఉపక్రమించటం ఆ మధ్యలో నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం పాఠ్యాంశాలు చదువుకోవడం ద్వారా పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు అని అన్నారు. విద్యార్థులు చదివింది రాయటం, పునఃశ్చరణ చేసుకోవడం ద్వారా సబ్జెక్టు ఎక్కువగా గుర్తు ఉంటుందని చెప్పారు. ఏకాగ్రత కోసం ప్రాణాయాయాలు చేయాలని సూచించారు. క్లిష్టమైన సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, అవసరం మేరకు ట్యూషన్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

తమ పిల్లలు ప్రతిరోజు నిద్రలేవటం, సమయానికి పడుకోవడం, తల్లిదండ్రులు అలవాటు చేయాలని, సెల్ ఫోన్లు, టీవీలకు దూరంగా ఉంచే విధంగా చూడాలన్నారు. పిల్లలు చదువుకునేందుకు కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని వారి ముందే తల్లిదండ్రులు తగాదాలు, గొడవలు పడుతూ పిల్లల ప్రశాంతతకు భంగం కలిగించవద్దని, పరిస్థితులకు అనుగుణంగా వారిలో మనోధైర్యం నింపాలన్నారు. బాగా చదువుకునేందుకు పిల్లల ఆరోగ్యం ఎంతో ముఖ్యమని చెబుతూ వారి పోషకాహారం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తల్లిదండ్రులకు సూచించారు.

పదవ తరగతి సిలబస్ ను నిర్ణీత సమయంలో పూర్తి చేసుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, తద్వారా పునఃశ్చరణకు సమయం కేటాయించే విధంగా ఉపాధ్యాయులు ప్రణాళిక చేయాలన్నారు.. తరచుగా స్లిప్ టెస్ట్ లు నిర్వహిస్తూ విద్యార్థుల్లో పరీక్షలపై భయం పోగొట్టే భరోసా, ధైర్యం ,ఆత్మవిశ్వం నింపాలని, ఆయా సబ్జెక్టుల్లో బలహీన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పారు.

పై అంశాలపై పూర్తి పర్యవేక్షణ ఉంచడం ద్వారా పదో తరగతి పరీక్షల్లో గొప్ప ఫలితాలు రాబట్టవచ్చని, అద్భుతాలు జరుగుతాయని చెబుతూ, విద్యార్థుల ప్రగతిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని, అవసరం మేరకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రత్యేక అధికారులకు సూచించారు.

వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా విద్యాశాఖ అధికారి యు వి సుబ్బారావు, డిప్యూటీ డీఈవోలు, ఎంఈఓ లు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...