Skip to main content

ప్రజా సమస్యల పరిష్కార వేదిక.....మీకోసం అర్జీలు 109

మచిలీపట్నం:

సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, డిఆర్ఓ చంద్రశేఖర రావు, పి జి ఆర్ ఎస్ నోడల్ అధికారి ఎస్ డి సి పోతురాజు, డిఎస్పి శ్రీనివాసరావు లతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక.....మీకోసం కార్యక్రమం నిర్వహించి జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. 
అర్జీదారుల సమస్యలను ఎంతో ఓపికగా ఆలకించి సంబంధిత అధికారులను పిలిపించి వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఆ ప్రకారం కలెక్టరేట్లో మొత్తం 109 అర్జీలు జిల్లా యంత్రాంగం స్వీకరించింది. అందులో కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి:

మచిలీపట్నం ఈడేపల్లికి చెందిన తిరుకోవల్లూరి మాధవి లత తన అర్జీ అందజేస్తూ కరగ్రహారం వైయస్సార్ జగనన్న కాలనీలో ఈడబ్ల్యూఎస్ లేఅవుట్ ఎల్ బ్లాక్ నందు 412 ఫ్లాట్ కు ఉత్తరాన ఉన్న ప్రభుత్వ స్థలమును బడుగు నాగరాజు అను వ్యక్తి ఆక్రమించారని ఆ ఆక్రమణలను తొలగించుటకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

మచిలీపట్నం నగరం లక్ష్మణరావుపురం ఆర్టీసీ కాలనీకి చెందిన కోకా గోవిందరావు మాట్లాడుతూ తాను నేర్చు ఆదినారాయణ అనే వ్యక్తి నుండి 125 గలజాల ఖాళీ స్థలా న్ని కొనుగోలు చేసుకుని రిజిస్టర్ చేసుకుందామని వైపు ఉన్న ఖాళీ స్థలాన్ని అమరయ్య అనే వ్యక్తులు ఆక్రమించుకున్నారని తన స్థలాన్ని సర్వే చేయాలని మున్సిపల్ సర్వేయర్ కు చెప్పిన ఎన్నిసార్లు చెప్పినా రావడంలేదని తాము సంవత్సరాల లోకి వెళితే రొయ్యల వ్యాన్లు అడ్డంపెట్టి వాళ్ళ మనుషులకు తమ మీద దాడి చేస్తున్నారని పోలీసుల సహకారంతో సర్వేయర్లలను పంపించి కొలతలు వేసి స్థలం అప్పగించవలసినదిగా వారు కోరుతున్నారు 

చల్లపల్లి మండలం కొత్త మాజేరు గ్రామ శివారు ఎన్టీఆర్ కాలనీ వాసులు నాగమల్లేశ్వరమ్మ తన అర్జీ అందజేస్తూ తాము కూలీ చేసుకుని జీవించే వారమని, 2000 సంవత్సరంలో ఇళ్ల స్థలాలు ఇవ్వగా 60 కుటుంబాల వారు ఇల్లు వేసుకుని జీవించుచున్నామని, తమ కాలనీలో శ్రీ మహాలక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లు నూతనంగా నిర్మించుకున్న డ్రయర్ నుండి దుమ్ము ధూళి వెలువడుతున్నాయని, దీని ఫలితంగా తమ ఇళ్లల్లోకి విపరీతమైన దమ్ము ధూళి వచ్చి తీవ్ర అసౌకర్యం అనారోగ్యానికి గురవుతున్నామన్నారు. ఇప్పటికే తమ కాలనీలో దుమ్ము ధూళి మూలంగా ఒకరు చనిపోయారని, ఇంకా ముగ్గురు ఊపిరితిత్తుల శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, పక్కనే ఉన్న మంచినీళ్ళ చెరువు కూడా కలుషితమవుతుందని రహదారులు చెట్లు ధూళితో నిండిపోతున్నాయని ఫిర్యాదు చేశారు. రైస్ మిల్లుకు 50 గజాలలో అంగన్వాడీ కేంద్రం ఉందని పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని, డ్రయర్ల ట్రాన్స్ఫార్మర్ స్థాయిని పెంచి ఏర్పాటు చేశారని ఆ కారణంగా 10 రోజులకు ఒకసారి ట్రాన్స్ఫార్మర్ పెద్దపెద్ద శబ్దాలతో పేలుతోందని, తమ ఇళ్లలో కరెంటు కూడా పోతూ ఉందని, తాము భయభ్రాంతులకు గురవుతున్నామని రైస్ మిల్లు డ్రయర్ ను, ట్రాన్స్ఫార్మర్ను తొలగించి తమ ఆరోగ్యాలను కాపాడాల్సిందిగా కోరారు.

రైతన్న మీకోసం

రైతన్న మీకోసం రెండో విడత. ఈనెల 16వ తేదీ నుండి ప్రారంభించడం జరుగుతుందని తెలియజేస్తూ రైతులకు ఐదు అంశాలపై అవగాహన కల్పించే దిశగా వ్యవసాయ శాఖ రూపొందించిన కరపత్రాన్ని జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో డిఎంహెచ్వో డాక్టర్ యుగంధర్ జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ పద్మావతి ఐ సి డి ఎస్ పి డి ఎం ఎన్ రాణి డిఎస్ఓ మోహన్ బాబు పౌరసరఫరాల డిఎం శివరాం ప్రసాద్ పంచాయతీరాజ్ ఈ ఎస్ ఈ రమణ రావు ఆర్ అండ్ బి ఈ ఈ లోకేష్ ఎల్డీఎం రవీంద్రారెడ్డి బిసి కార్పొరేషన్ ఈడీ రాజేంద్ర బాబు ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ సోమశేఖర్ డి డిపిఓ అరుణ జిల్లా ఉద్యాన అధికారి జ్యోతి జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...