Skip to main content

క్రీడలు మన జీవితంలో చాలా ముఖ్యమైనవి: అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ



మచిలీపట్నం:

              కృష్ణా జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి
కె. ఝాన్సీ లక్ష్మి ఆధ్వర్యంలో 45వ డివిజన్ ఇండోర్ స్టేడియంలో జిల్లా స్థాయి చెస్ పోటీలు మంగళవారం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ మాట్లాడుతూ క్రీడలు మన జీవితంలో చాలా ముఖ్యమైనవి అని, మన ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా క్రమశిక్షణ మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి అన్నారు. 

         చెస్ ఒక మేదస్సు ఆధారిత ఆట అన్నారు. ఇది మన ఆలోచన శక్తిని, సహనాన్ని మరియు నిర్ణయ సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తుంది అన్నారు. చెస్ ద్వారా మనం ముందు చూపుతో ఆలోచించడం నేర్చుకుంటాం అన్నారు. చెస్ పోటీలలో ప్రముఖ గ్రాండ్ మాస్టర్ విశ్వనాధ్ ఆనంద్ ప్రపంచ ఖ్యాతి పొందారు అన్నారు. అలాంటివారిని స్ఫూర్తిగా తీసుకుని ఆటలో ముందుకు వెళ్లి పోటీలో విజయం సాధించాలి అన్నారు. క్రీడలు శారీరక, మానసిక వికాసానికి ఎంతో అవసరం, అందరూ రోజు కొంత సమయం క్రీడలకు కేటాయించాలి అన్నారు. 

          జిల్లా క్రీడా అధికారి కె. ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రస్థాయి చెస్ పోటీల ఎంపికలో భాగంగా జిల్లా స్థాయిలో చెస్ పోటీలలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 155 మంది యువత చెస్ పోటీలలో పాల్గొన్నారు అని తెలిపారు. జిల్లా స్థాయిలో జరిగిన చెస్ పోటీలలో 16 మంది యువత రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు విజేతలుగా ఎంపికయ్యారని, ఈ రాష్ట్రస్థాయి చెస్ పోటీలలో ఎంపికైన వారు ఈనెల 21, 22 తేదీలలో తిరుపతిలో రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనేందుకు వారిని పంపించడం జరుగుతుంది అన్నారు. ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది అని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యువతను జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి, కె. ఝాన్సీ లక్ష్మి కోరారు. 

        ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్, పి. వి. ఫణి కుమార్, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్, హసీం బేగ్, రాష్ట్ర శిష్ట కరణం సాధికార సమితి కన్వీనర్, అక్కుమహంతి రాజా, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం నగర కార్పొరేషన్ అధ్యక్షుడు, లోగి శెట్టి వెంకటస్వామి, జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ మాజీ డైరెక్టర్, అజీమ్, ప్రముఖ న్యాయవాది అమర్, చెస్ ఆర్గనైజేషన్ ఆర్బిట్రేటర్స్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...