Skip to main content

పరిశ్రమలు నెలకొల్పేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి : జిల్లా కలెక్టర్ డి కె బాలాజీ

మచిలీపట్నం :

జిల్లాలో విరివిగా పరిశ్రమలు నెలకొల్పేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని, వారికి కావాల్సిన సహకారం అన్ని విధాల అందిస్తామని ప్రభుత్వ రాయితీలు మంజూరు చేస్తామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. 

శనివారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో జిల్లా పరిశ్రమలు ఎగుమతులు ప్రోత్సాహక మండలి సమావేశం నిర్వహించి పరిశ్రమల పురోగతిని సమీక్షించారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సింగిల్ డెస్క్ పాలసీ కింద జిల్లాలో 850 దరఖాస్తులు అందగా అందులో 755 దరఖాస్తులకు అన్ని రకాల అనుమతులు మంజూరు చేసి ఆమోదించామన్నారు. ఇంకను పెండింగ్లో ఉన్న 95 దరఖాస్తులను వేగవంత వాణిజ్యం కింద సత్వరమే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

పీఎం విశ్వకర్మ పథకం కింద 2079 దరఖాస్తులను రుణం మంజూరు కోసం బ్యాంకులకు పంపగా 897 దరఖాస్తులకు 8.26 కోట్ల రూపాయలు మంజూరయ్యాయన్నారు.

ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ పీఎంఈజీపి పథకం కింద 239 దరఖాస్తులను రుణం మంజూరు కోసం బ్యాంకులకు పంపగా అందులో 142 యూనిట్లు నెలకొల్పడం జరిగిందన్నారు. 

ఇటీవల విశాఖపట్నంలో జరిగిన భాగస్వామ్య సదస్సులో ఒప్పందం కుదుర్చుకున్న 12 భారీ కంపెనీలకు సంబంధించి అవసరమైన సౌకర్యాలను సత్వరమే కల్పించి పరిశ్రమలు నెలకొల్పుటకు చొరవ చూపాలన్నారు. 


ర్యాంపు కార్యక్రమం ద్వారా పరిశ్రమల నెలకొల్పుటకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన కార్యక్రమాలు, కార్యశాలలు పెద్ద ఎత్తున నిర్వహించాలన్నారు.

అన్ని నియోజకవర్గాల్లో ఎం ఎస్ ఎం ఈ, నానో పార్కులు ఏర్పాటు చేయుటకు అవసరమైన ప్రభుత్వ భూములను గుర్తించాలన్నారు. 

పామర్రు నియోజకవర్గంలో అయినంపూడి 6.91 ఎకరాల్లో ఎంఎస్ఎమ్ఈ పార్క్ ఏర్పాటు చేయుటకు అన్ని పనులు వచ్చే మార్చి నెలాఖరిలోగా పూర్తి చేయాలన్నారు.


జిల్లాలో 5 ఎం.ఎస్.ఎం.ఇ యూనిట్ లకు
3 కోట్ల 97 లక్షల 40 వేల 467 రూపాయల పెట్టుబడి రాయితీ, అమ్మకం పన్ను తిరిగి చెల్లింపు రాయితీ, స్టాంపు డ్యూటీ తిరిగి చెల్లింపు రాయితీలు మంజూరు చేస్తూ జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు.

ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం ఆర్ వెంకటరావు, ఏపీఐఐసీ జెడ్ ఎం బాబ్జి, కాలుష్య నియంత్రణ మండలి ఈ ఈ శ్రీనివాసరావు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...