Skip to main content

పోలీస్ శాఖలో విధులు నిర్వహించి ఆరోగ్యంగా పదవి విరమణ చెందడం అదృష్టం - ఎస్పీ వి వి .విద్యాసాగర్ నాయుడు

  మచిలీపట్నం :

            సుదీర్ఘకాలం పాటు పోలీస్ శాఖలో విధులు నిర్వహించి ఆరోగ్యంగా పదవీ విరమణ చెందడం అదృష్టమని ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన పోలీస్ సిబ్బంది ఆత్మీయ వీడ్కోలు సభలో జిల్లా ఎస్పీ  వి.విద్యాసాగర్ నాయుడు అన్నారు. ఎస్పీ తో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వి.వి నాయుడు, అడిషనల్ ఎస్పీ ఏ ఆర్ బి. సత్యనారాయణ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సత్య కిషోర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు రాఘవయ్య, రవి కిరణ్, రవికుమార్  ఇతర పోలీసు అధికారులు పదవీ విరమణ చెందుతున్న సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
         మొదటగా పదవీ విరమణ చెందుతున్న సిబ్బంది ని శాలువాలు జ్ఞాపికలతో వారి కుటుంబ సభ్యుల సమక్షంలో సత్కరించి, పదవి విరమణ కేవలం సర్వీస్కు మాత్రమేనని మీ సేవలు ఎల్లవేళలా వినియోగించుకోవడానికి కృష్ణాజిల్లా పోలీస్ శాఖ సంసిద్ధంగా ఉంటుందని ఎస్పీ  తెలిపారు.

          ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ....30 సంవత్సరాల పైన పోలీస్ శాఖకు ఎనలేని సేవలందించిన మీ అందరికీ అభినందనలు. మీ జీవిత భాగస్వామి సహకారం, కుటుంబ సభ్యులు అందించిన తోడ్పాటు విజయవంతంగా మీ సర్వీసును పూర్తి చేయడానికి అవకాశం కుదిరిందని అన్నారు.

         విరమణ అనేది మీ విధులకే గాని మీ ఆరోగ్యానికి కాదని ఇక నుండి ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ కనపరుస్తూ కొత్త వ్యాపకాలపై దృష్టిని కేటాయించి శారీరక వ్యాయామం చేస్తూ తరచు మెడికల్ చెకప్ లు చేయించుకుంటూ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని తెలిపారు. 

        మానసిక ఇబ్బందులు లేకుండా విరమణ సందర్భంగా వచ్చిన ప్రయోజనాలను అర్థవంతంగా వినియోగించుకొని ప్రశాంత జీవనం గడపాలన్నారు. విరమణ చెందినప్పటికీ మీరంతా మా కుటుంబ సభ్యులేనని ఏ సమయంలో ఏ సహాయం కావాలన్నా ధైర్యంగా రావచ్చని తెలిపారు. 

         ఇప్పటివరకు బంధుమిత్రుల వేడుకలకు, తీర్థయాత్రలకు, దేవాలయ దర్శనాలకు వెళ్లే అవకాశం సరిగా కుదిరి ఉండకపోవచ్చు. కనుక మిగిలిన ఈ జీవితాన్ని కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతూ దైవదర్శనాలు చేసుకుంటూ సంతోషంగా ఉండాలని కోరారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...