Skip to main content

వైఎంసిఎ ద్వారా సమాజంలో మెరుగైన క్రైస్తవ యువత


మచిలీపట్నం:

క్రైస్తవ యువత లోని విభిన్న ప్రతిభాపాటవాలను వెలికితీసి వారిని మరింత ప్రోత్సాహించడం ద్వారా సమాజంలో మెరుగైన యువతగా తీర్చిదిద్దేందుకు ఇతోధిక కృషి చేస్తున్నట్లు యంగ్ మెన్ క్రిస్టియన్ అసోసియేషన్ ఆంధ్రా తెలంగాణా రీజిఒనల్ సెక్రటరీ రెవరెండ్. ధనరాజ్ పేర్కొన్నారు.  

బుధవారం సాయంత్రం ఆయన కృష్ణాజిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నం భాస్కరపురం లోని ఇమ్మానియేల్ గాస్ఫెల్ చర్చిలో మంగినపూడి వైఎంసిఎ ఆధ్వర్యంలో సౌత్ ఈస్ట్ ఇండియా రీజియన్ కృష్ణా గోదావరి సబ్ రీజినల్ నూతన నాయకుల ఒకరోజు శిక్షణా కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.     

ఈ సందర్భంగా రెవరెండ్ ధనరాజ్ మాట్లాడుతూ, కృష్ణా గోదావరి జిల్లాల సబ్ రీజినల్ ఛైర్మెన్ నల్లపు నిర్మల్ హెరాల్డ్ ప్రత్యేక చొరవతో ఈ ప్రాంతంలో యువతీ యువకులు పెద్ద ఎత్తున వైఎంసిఎ సభ్యత్వం ఎంతో ఉత్సాహంగా తీసుకోవడం చాలా అభినందనీయమన్నారు. తమ వైఎంసిఎ మాజీ అధ్యక్షులు డాక్టర్ రోనాల్డ్ విలియం, రీజినల్ ఛైర్మెన్ డాక్టర్ సుమన్ త్యాగరాజు, నేషనల్ వైస్ ఛైర్మెన్ డాక్టర్ బి. విలియమ్స్ ఆధ్వర్యంలో తాము అనేక ప్రాంతాలలో యంగ్ మెన్ క్రిస్టియన్ అసోసియేషన్ యంగ్ మెన్ క్రిస్టియన్ అసోసియేషన్ మరింత బలోపేతం చేసేందుకు సంసిద్దమైనట్లు తెలిపారు.    

భారతీయ వైఎంసిఎ మన దేశంలోని వివిధ పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో క్రైస్తవ యువతీ యువకుల మెరుగైన జీవిత వికాసాభివృద్ధికి తన వంతు కృషి చేస్తుందని చెప్పారు. అందరితో స్నేహ సంబంధాలను మరింతగా మెరుగుపరుచుకోవడంతో పాటు లౌకిక దృక్పథంతో వైఎంసిఎ కొనసాగుతుందన్నారు. గత 170 సంవత్సరాలకు పైగా భారతీయ యువత అభివృద్ధికి తన కార్యక్రమాలను అంకితం చేసిన యంగ్ మన్ క్రిస్టియన్ అసోసియేషన్ ముఖ్యంగా భారతీయ యువత శరీరం, మనస్సు మరియు ఆత్మ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. 

భారతదేశంలోని వైఎంసిఎ ఒక స్వచ్ఛంద సేవా సంస్థ అని ఎటువంటి లాభాపేక్షలేని సమూహాల భాగస్వాములతో పనిచేస్తూ క్రీడలు , ఆరోగ్య సంరక్షణ, విద్య, వృత్తి శిక్షణ, అవగాహన , ఆదాయ ఉత్పత్తి కార్యక్రమాలలో సమాజంలోని బలహీన వర్గాలకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు మరియు సేవలను అందిస్తుందని వివరించారు . 

ఈ శిక్షణా కార్యక్రమంలో కర్నూల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎడ్మన్డ్ కృపానందం, సబ్ రీజినల్ ట్రెజరర్ సురేష్, భీమవరం రీజినల్ కార్యదర్శి మేరీ శ్యామ్, స్థానిక 13 వ డివిజన్ కార్పొరేటర్ బందెల థామస్ నోబుల్ , గెరా ఇర్విన్ స్కాట్ విద్యా సాగర్, యషియా రాజ్, సురేష్, గరికిముక్కు జయరాజు, జర్నలిస్ట్ కృష్ణారావు, చంద్రశేఖర్, గొట్రు సందీప్, మంగం ఇజ్రాయిల్ పాల్ (పండు), మంగం జోసెఫ్ పాల్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...