Skip to main content

ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు ఇవ్వాలి.....బి ఎల్ నరసింహులు

మచిలీపట్నం :

         తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు  ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు ఇవ్వాలని కోరుతూ ఆ అవార్డుకు అడ్డంకులు తొలగాలని భగవంతుని ప్రార్థిస్తూ మాల ధారణతో కూడిన పాదయాత్రను కృష్ణాజిల్లా నిమ్మకూరు నుంచి సత్యసాయి జిల్లా ధర్మవరం టౌనుకు చెందిన బి ఎల్ నరసింహులు ప్రారంభించి జిల్లా మొత్తం  పర్యటించి విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం చేసుకుని 41 రోజులపాటు ఈ పాదయాత్ర చేసుకుని మరల ఎన్టీఆర్ సొంత గ్రామమైన నిమ్మకూరులో ఎన్టీఆర్ దంపతుల విగ్రహాల వద్ద ఈ దీక్షను విరమించడం జరుగుతుందని బిఎల్ నరసింహులు తెలిపారు.

        బి ఎల్ నరసింహులు ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చేస్తున్న పాదయాత్ర 12వ రోజు అయిన గురువారం మచిలీపట్నం విచ్చేసిన సందర్భంగా మచిలీపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం నగర అధ్యక్షుడు లోగిశెట్టి స్వామి ఆధ్వర్యంలో ఆయనకు అభినందనలు తెలిపి పాదయాత్ర విజయవంతం అవ్వాలని పాదయాత్ర చేస్తున్న బిఎల్ నరసింహులను తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించి, బిఎల్ నరసింహులు పాదయాత్రకు మద్దతు తెలిపారు.

      ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం నగర అధ్యక్షుడు లోగిశెట్టి వెంకటస్వామి మాట్లాడుతూ తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మహనీయుడు స్వర్గీయ అన్న ఎన్టీఆర్ అన్నారు. బి ఎల్ నరసింహులు పాదయాత్రకు మచిలీపట్నం నగర తెలుగుదేశం పార్టీ తరఫున మద్దతు తెలుపుతున్నాము అన్నారు. 

     ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ పి. వి. ఫణి కుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎండి ఇలియాస్ పాషా, అడపా రత్నాకర్, కొల్లు రంగ, వి. వెంకటేశ్వరరావు, వనం రెడ్డి ప్రసాద్, కోమటి శ్రీనివాస్, కే. వెంకటేశ్వరరావు, కే .ఎర్రబాబు, టి .రాజ్యలక్ష్మి, అంకం లక్ష్మి, అబ్దుల్ అజీమ్, షేక్ ఫిరోజ్, తోట మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...